బెంగాల్లో ‘అల్ఖైదా’ విస్తరిస్తోంది: గవర్నర్
పశ్చిమబెంగాల్లో శాంతి భద్రతలకు ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థ అల్ఖైదా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం దిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్షాతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో శాంతి భద్రతలకు ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థ అల్ఖైదా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం దిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్షాతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. బెంగాల్లో శాంతి భద్రతల విషయమై గవర్నర్ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై గత కొద్ది నెలలుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
‘రాష్ట్రంలో భద్రతకు ముప్పు పొంచి ఉంది. ఉగ్ర సంస్థ అల్ఖైదా నెట్వర్క్ విస్తరించడంతో పాటు అక్రమ బాంబుల తయారీ కార్యకలాపాలు సైతం ప్రబలంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తోందనే విషయం తెలియడం లేదు. రాష్ట్రంలోని పోలీసులు రాజకీయ వ్యక్తుల్లా వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయి. బెంగాల్కు 2021 శాసనసభ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కాబట్టి ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు వారికిది మంచి అవకాశం’ అని గవర్నర్ అన్నారు.
‘ఈ దేశానికే చెందిన భరతమాత బిడ్డలు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా బెంగాల్కు వస్తే వారిని ఔట్సైడర్స్ అని పిలవడం బాధిస్తోంది. రాష్ట్రంలో 2018 పంచాయతీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపడేలా చేశాయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో హింసాకాండకు తావు లేకుండా ప్రతిఒక్కరూ కలిసి పనిచేయాలి’ అని ధన్కర్ విజ్ఞప్తి చేశారు. బెంగాల్లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భాజపా, టీఎంసీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం