టీకా పంపిణీ తర్వాత ఆ పనే: అమిత్ షా
దేశంలో టీకా పంపిణీ మొదలు కాగానే ఆ విషయంపై దృష్టి పెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
బోల్పూర్: కరోనా వ్యాప్తి కారణంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం కాస్త తెరమరుగయ్యిందని.. దేశంలో టీకా పంపిణీ మొదలు కాగానే ఆ విషయంపై దృష్టి పెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా భాజపా అధినేత జేపీ నడ్డా కాన్వాయ్పై ఇటీవల జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలని షా విరుచుకు పడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ కేడర్కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్పై పంపించాలని కోరుతూ కేంద్రం, తృణమూల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగా, ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, ఆమోద యోగ్యం కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించే బాధ్యత వారిపై ఉన్నందున.. సంబంధిత ఐపీఎస్ అధికారులను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. వివరణ కోరుతూ రాష్ట్రానికి లేఖ రాయటం చట్టబద్ధమేనని.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నిబంధనల పుస్తకాలను ఓ సారి పరిశీలించాలంటూ ఆయన మమత ప్రభుత్వానికి హితవు పలికారు.
పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన నియమాలను రూపొందించటం ఓ భారీ ప్రక్రియ అని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతమున్న కొవిడ్ పరిస్థితిలో దానిని కొనసాగించలేమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ ద్వారా కరోనా శృంఖలాన్ని ఛేదించిన వెంటనే తాము ఈ అంశంపై దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మమత, ఆమె పార్టీయే ‘స్థానికులు- పరాయివారు’ అనే అంశాన్ని లేవనెత్తారని ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి విమర్శించారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి