తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభం

తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో

Published : 13 Nov 2020 16:40 IST

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సాదా బైనామాల చట్టసవరణ కోసం ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించే వీలుంది. మరోవైపు సన్నరకం ధాన్యానికి బోనస్‌ ఇచ్చే అంశంపై చర్చించడంతో పాటు గవర్నర్‌ కోటాలో ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లను ఈ భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌లో జరిగిన నష్టాలు, జిల్లాల్లో పంట నష్టాలు, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర, కరోనా నేపథ్యంలో ఆదాయాలు తగ్గినందున తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపైనా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని