రామ్నాథ్జీ.. ఆ బిల్లులను ఆమోదించొద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖబీర్ సింగ్ బాదల్ కోరారు. రెండు వ్యవసాయ బిల్లులు....
చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కోరారు. రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ బిల్లులను వెనక్కి పంపాలని రాష్ట్రపతిని కోరారు.
‘‘రైతులకు సంబంధించిన బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతిని కోరుతున్నా. వాటిని పునః పరిశీలన నిమిత్తం పార్లమెంట్కు పంపాలని వేడుకొంటున్నా. రైతులు, కూలీలు, దళితుల శ్రేయస్సు కోసం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నా’’ అని సుఖ్బీర్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే రైతులు మనల్ని క్షమించరని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం అని, అణచివేత కాదు అని పేర్కొన్నారు.
వ్యవసాయానికి సంబంధించి ‘ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసు’ బిల్లులకు ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అకాలీ నేత హర్సిమ్రత్ సింగ్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఈ బిల్లులను రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!