ప్రమాణస్వీకారం చూడ్డానికెళ్లి.. మంత్రిగా వచ్చి..!
మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ ముఖర్జీ అస్తమయమయ్యారు. సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం దేశ ప్రథమ పౌరుడి స్థాయి వరకు ఎదిగింది. ఈ క్రమంలో ఆయన పడిన కష్టం, చేసిన కృషి........
ఇంటర్నెట్ డెస్క్: మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. ఓ సాధారణ ఉద్యోగిగానే మొదలైన ఆయన జీవితం దేశ ప్రథమ పౌరుడి స్థాయి వరకు ఎదిగింది. ఈ క్రమంలో ఆయన పడిన కష్టం, చేసిన కృషి, పట్టుదల ఆయన్ను దేశ రాజకీయాల్లో విలక్షణమైన ధ్రువతారలా వెలిగేలా నిలిపింది. రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎక్కిన ఒక్కొక్క మెట్టూ నల్లేరు మీద నడకలా ఏమీ సాగలేదు. జీవితంలో ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు. రాజకీయాల్లో ఎన్నో ఉత్థానపతనాలను చూసిన ప్రణబ్ దాదాకు కేంద్రమంత్రి పదవి అనూహ్యంగా ఎలా దక్కింది? ఆయన పాటించిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు, ఇష్టాలు ఏంటి..?
అది 1973.. ప్రణబ్కు కేంద్ర సహాయ మంత్రి వరించిన సంవత్సరం.. ఈ పదవి విచిత్రకర పరిస్థితుల్లో దక్కింది. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చూడటానికి రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ప్రణబ్ ముఖర్జీ కేంద్ర సహాయ మంత్రిగా బయటకొచ్చారు. ప్రమాణం చేయబోయే మొత్తం మంత్రుల సంఖ్య అశుభకరమని ‘పెద్దలు’ భావించడంతో ప్రణబ్ను పారిశ్రామిక అభివృద్ధి శాఖ సహాయ మంత్రిని చేసి ‘లెక్క’ను సరిచేశారు. దీంతో అప్పటి నుంచి ప్రణబ్ రాజకీయ ‘లెక్కలు’ దాదాపుగా తప్పలేదు. రాజీవ్ హయాంలో రాజకీయ చీకటి అంటే ఏమిటో రుచి చూసి మళ్లీ ‘వెలుగు’లోకి వచ్చిన తర్వాత ఇక పల్లమంటూ ఎరగలేదు. 1978లో సీడబ్ల్యూసీకి ఎంపికైన ప్రణబ్ 1980లో పార్టీలో నంబర్ 2 స్థానానికి ఎదిగారు. ఇందిరకు కీలక సలహాదారుడిగా ఉన్నారు.
పల్లెటూరి అబ్బాయి అనిపించుకోవడమే ఇష్టం!
దాదాగా సుపరిచుతుడైన ప్రణబ్ను సన్నిహితులు ముద్దుగా పొల్తు అని పిలుచుకొనేవారు. ప్రణబ్ ముఖర్జీకి రోజూ డైరీ రాసే అలవాటు ఉంది. ఎంత తీరిక లేకున్నప్పటికీ రోజూ ఒక పేజీ అయినా రాయడం అలవాటు. రోజూ ప్రణబ్ వేకువజామునే నిద్ర లేచేవారు. పూజ అనంతరం ఇక విధుల్లో మునిగిపోయేవారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పుస్తక పఠనం అలవాటు. మధ్యాహ్నం ఓ గంట పాటు కునుకు తీయడం అలవాటు. దాదాపు 17 ఏళ్లు స్వగ్రామంలోని పూర్వికుల ఇంట్లోనే ఉన్న ప్రణబ్కు స్వగ్రామం, ఆ ఇల్లు అంటే ఎంతో మమకారం. ఇప్పటికీ ఆయన తనను పల్లెటూరి అబ్బాయి అనిపించుకోవడానికే ఇష్టపడేవారు. ప్రణబ్ ముఖర్జీకి చేపల కూర అంటే ఎంతో ఇష్టం. మంగళవారాలు తప్పించి దాదాపు రోజూ చేపల కూర ఉండాల్సిందే!
లక్కీ నంబర్ 13
అందరూ దురదృష్టమైనదిగా భావించే ‘13’ ప్రణబ్ ముఖర్జీకి అదృష్ట సంఖ్య. ఈ సంఖ్యతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉంది. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నికకావడం గమనార్హం. ఆయన లోక్సభకు తొలిసారిగా ఎన్నికైంది 2004 మే 13న. ప్రణబ్కు వివాహమైంది 1957 జులై 13న. ఆయన అప్పట్లో నివసించిన తల్కతొరా రోడ్డులోని 13వ నంబర్ ఇంటిలోనే. యూపీఏ ప్రభుత్వంలో వివాదాల పరిష్కర్తగా ప్రముఖ పాత్ర పోషించిన ప్రణబ్కు పార్లమెంటు రూమ్ నంబర్ 13లోనే కార్యాలయం ఉండేది.
ఇదీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం