పార్లమెంట్లో విపక్షాల నిరసన
రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులపై విపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా విపక్షాలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలో ర్యాలీ నిర్వహించి
దిల్లీ: రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులపై విపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా విపక్షాలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడానికి వీల్లేని విధంగా ప్రైవేటు సంస్థలకు కళ్లెం వేసేలా బిల్లును తీసుకురావాలని, స్వామినాథన్ కమిషన్ చెప్పిన ప్రకారం కనీస మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలని కోరారు.
మరో వైపు రాజ్యసభ నుంచి సస్పెండైన 8మంది ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. విపక్షపార్టీలకు చెందిన పలువురు ఎంపీలు వారికి మద్దతిచ్చారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్వాదీ, శివసేన,ఆర్జేడీ, డీఎంకే, తెరాస, ఆప్ ఎంపీలంతా నిరసనలో పాల్గొన్నారు. సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రతిపక్షాలు భేటీ అయ్యే అవకాశముంది. వ్యవసాయ బిల్లులు, వాటి ఆమోద సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో కేవలం ఐదుగురు నాయకులను మాత్రమే రాష్ట్రపతి భవన్ అధికారులు అనుమతించినట్లు సమాచారం. రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ అజాద్ చాంబర్లో సమావేశమైన విపక్షనేతలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.