BJP: లఖింపుర్ ఎఫెక్ట్ .. భాజపా కమిటీలో ‘గాంధీ’లకు దక్కని చోటు!
80మందితో భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫిషియో సభ్యుల పేర్లను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు .......
80మందితో జాతీయ కార్యనిర్వాహక కమిటీ ప్రకటన
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం
దిల్లీ: భాజపా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ఎంపీలు మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు ఈసారి చోటు దక్కలేదు. వ్యవసాయ చట్టాలు, లఖింపుర్ ఖేరి ఘటనలపై వరుణ్ గాంధీ ట్వీట్లు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం 80మందితో భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫిషియో సభ్యుల పేర్లను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖరారు చేసినట్టు భాజపా జాతీయ అధికార ప్రతినిధి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్కే ఆడ్వాణీ, డాక్టర్ మురళీమనోహర్ జోషీ, రాజ్నాథ్సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ; తెలంగాణ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, జి. రామ్మోహన్రావులకు అవకాశం లభించింది.
అలాగే, ఈ జాతీయ కార్యవర్గ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా 50మంది, ఎక్స్ అఫిషియో సభ్యులుగా 179మందిని ఎంపిక చేసినట్టు అరుణ్సింగ్ వెల్లడించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విజయశాంతి, ఈటల రాజేందర్కు అవకాశం లభించింది. వచ్చే నెల7న భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ దిల్లీలో భేటీ కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ కమిటీ సమావేశం కానుండటం గమనార్హం.
వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు మొండిచేయి!
మరోవైపు, భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుంచి మేనకా గాంధీ, వరుణ్ గాంధీలను ఈసారి తప్పించడం గమనార్హం. వరుణ్ గాంధీ ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి, మేనకా గాంధీ సుల్తాన్పుర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో పాటు లఖింపుర్ ఖేరిలో హింసాత్మక ఘటనలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలపై తన వాణి విన్పిస్తున్నారు. లఖింపుర్ ఖేరి ఘటనపై ఈ రోజు కూడా రెండు వీడియోలను ట్విటర్లో షేర్ చేసిన ఆయన.. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మేనకా గాంధీ, వరుణ్ గాంధీలను జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుంచి తప్పిస్తూ నిర్ణయం రావడం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె