ఆ రెండు బిల్లులనూ ఆమోదించొద్దు
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.
గవర్నర్కు కన్నా విజ్ఞప్తి
అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ విరుద్ధమని లేఖలో తెలిపారు. వాటిని శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపిందని, అంతేకాకుండా ఆ రెండు అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున ధిక్కారం కిందికి వస్తుందని చెప్పారు. అమరావతి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం బాండ్ల రూపంలో రూ. 2వేల కోట్లు సమీకరించిందని, రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా నిధులు ఇచ్చిందని లేఖలో వివరించారు. రాజధాని కోసం అక్కడి రైతులు 32వేల ఏకరాల భూమి ఇచ్చారని, వారు చేస్తున్న శాంతియుత పోరాటాన్ని గుర్తించాలని కోరారు. రాజ్యాంగ పరమైన అంశాలను పరిశీలించడంతోపాటు ప్రజల ఆకాంక్షలు పరిగణించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పంపించిన బిల్లులు ఆమోదించవద్దని భాజపా నుంచి కోరుతున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత