ఆ రెండు బిల్లులనూ ఆమోదించొద్దు

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

Published : 19 Jul 2020 01:23 IST

గవర్నర్‌కు కన్నా విజ్ఞప్తి

అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఆ రెండు బిల్లులూ రాజ్యాంగ విరుద్ధమని లేఖలో తెలిపారు. వాటిని శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపిందని,  అంతేకాకుండా ఆ రెండు అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున ధిక్కారం కిందికి వస్తుందని చెప్పారు. అమరావతి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం బాండ్ల రూపంలో రూ. 2వేల కోట్లు సమీకరించిందని, రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా నిధులు ఇచ్చిందని లేఖలో వివరించారు. రాజధాని కోసం అక్కడి రైతులు 32వేల ఏకరాల భూమి ఇచ్చారని,  వారు చేస్తున్న శాంతియుత పోరాటాన్ని గుర్తించాలని కోరారు. రాజ్యాంగ పరమైన అంశాలను పరిశీలించడంతోపాటు ప్రజల ఆకాంక్షలు పరిగణించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పంపించిన బిల్లులు ఆమోదించవద్దని భాజపా నుంచి కోరుతున్నట్లు తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని