త్వరలోనే సీఏఏ అమలు: నడ్డా
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని త్వరలోనే అమలు చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో...........
సిలిగురి (బెంగాల్): దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని త్వరలోనే అమలు చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ చట్టం అమలులో జాప్యం ఏర్పడిందన్నారు. ఉత్తర బెంగాల్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా విభజించి పాలించే రాజకీయాలను సాగిస్తోందని ఆరోపించారు. భాజపాలా అందరి అభివృద్ధి కోసం పని చేయడంలేదని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ఈ చట్టం అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని నడ్డా స్పష్టంచేశారు.
కరోనాతో ఏర్పడిన పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడుతున్న తరుణంలో అతి త్వరలోనే సీఏఏ అమలు చేయనున్నట్టు తెలిపారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2021లో జరగబోయే ఎన్నికల్లో భాజపానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మమతా బెనర్జీ హయాంలో హింసాత్మక రాజకీయాలకు, కట్-మనీ సంస్కృతికి ప్రజలు విసిగిపోయారని నడ్డా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం