అమిత్ షాతో తోమర్ రెండున్నర గంటల భేటీ!
వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకొనే వరకూ వెనక్కి తగ్గేదిలేదని రైతు సంఘాలు తేల్చి చెప్పిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా
దిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకొనే వరకూ వెనక్కి తగ్గేదిలేదని రైతు సంఘాలు తేల్చి చెప్పిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. మంగళవారం రాత్రి రైతు సంఘాలతో చర్చించిన అమిత్ షా చట్టాలను వెనక్కి తీసుకొనేది లేదని, కొన్ని సవరణలకు అంగీకరిస్తామని స్పష్టంచేశారు.
అలాగే, గత 14 రోజులుగా పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతు సంఘాలకు బుధవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను పంపింది. వాటిని తిరస్కరించిన రైతు సంఘాల నేతలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు. మరోవైపు, విపక్ష నేతల బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది. వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లిన నేతలు.. వాటిని ఉపసంహరించుకోవాలని కోరిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!