తెదేపా నిర్ణయాల వల్లే ఈ ఇబ్బందులు:బుగ్గన

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం పేర్కొందని..

Published : 24 Oct 2020 02:05 IST

దిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం పేర్కొందని గుర్తు చేశారు. సొంత ప్రయోజనాల కోసమే పోలవరం నిర్మాణాన్ని తెదేపా ప్రభుత్వం చేపట్టిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే ప్రస్తుతం ఈ ఇబ్బందులని బుగ్గన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.4వేల కోట్లు పోలవరానికి ఖర్చు చేసిందని.. ఆ నిధులు వెంటనే విడుదల చేయాని నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని