Karnataka: పునీత్‌ ద్వాదశ దినకర్మకు వేలాదిగా వచ్చిన అభిమానులు

ఇటీవల మృతి చెందిన కన్నడ పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ ద్వాదశ దినకర్మకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

Updated : 10 Nov 2021 16:40 IST

బెంగళూరు: ఇటీవల కన్నుమూసిన కన్నడ పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ ద్వాదశ దినకర్మకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. బెంగళూరు కంఠీరవ స్టూడియోస్‌లోని పునీత్ సమాధి ఉన్న ప్రాంతంలో మంగళవారం ఆయన కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పునీత్ భార్య అశ్విని, కుమార్తెలు ధృతి, వందిత సహా కుటుంబసభ్యులు పునీత్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంఠీరవ స్టూడియోస్‌లో ఆహార పంపిణీ చేపట్టారు. పునీత్ భార్య అశ్విని, సోదరులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్.. అభిమానులకు భోజనం వడ్డించారు. 40 వేల మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజయర్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని