Thaman: అరవింద సమేతలో ఆ పాట కోసం ఎంతో కష్టపడ్డా..!

బ్యాక్‌ టు బ్యాక్‌ స్టార్‌ హీరో సినిమాలు ఓకే చేస్తూ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు తమన్‌. వరుస సినిమాల కారణంగా ఫుల్‌ బిజీగా...

Published : 29 Nov 2021 15:54 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తమన్‌.. గతంలో ఓ పాట కోసం ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. కానీ, దానికి అనుకున్నంత స్థాయి గుర్తింపు రాలేదని వివరించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో  ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘అరవిందసమేత’ ఆల్బమ్‌ అంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ‘ఏడ పోయినాడో’ అనే పాట కోసం ఎంతో కష్టపడి వర్క్‌ చేశాను. అందులో విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాట పాడటం కోసం వైజాగ్‌ నుంచి నిఖిత శ్రీవల్లి అనే సింగర్‌ని పిలిపించాం. ఎంతోమంది వాయిస్‌లు టెస్ట్‌ చేశాం. కానీ, ఆ అమ్మాయి వాయిస్‌ మాత్రమే ఆ పాటకు సెట్‌ అయ్యింది. సినిమా విడుదలయ్యాక తప్పకుండా ఆ పాటకు మంచి గుర్తింపు వస్తుందని భావించాను. ‘రెడ్డమ్మతల్లి’, ‘పెనివిటి’ పాటలకు వచ్చినంత ప్రశంసలు ఈ పాటకు రాలేదు. అప్పుడు కొంచెం బాధగా అనిపించింది. అలాగే నేను ట్యూన్స్ కాపీ కొడుతున్నానంటూ కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తుంటాయి. అవి విన్నప్పుడు కొంత బాధగా ఉంటుంది. ఆ బాధ, కోపం పోగొట్టుకోవడానికి వెంటనే గ్రౌండ్‌కి వెళ్లి క్రికెట్‌ ఆడతా. పాటలకు అనుకున్నంత మంచిగా ట్యూన్స్‌ రాకపోయినా సరే వెంటనే గ్రౌండ్‌కి వెళ్లిపోతా’’ అని తమన్‌ వివరించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని