Sivasankar: ‘మగధీర’ పాటకు 22 రోజులు.. ‘అరుంధతి’ పాటకు 32 రోజులు!
కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుడిని బలితీసుకుంది. ఎన్నో వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చి, తెలుగు, తమిళ భాషల్లో
ఇంటర్నెట్డెస్క్: డ్యూయెట్లు, మాస్ సాంగ్లకు డ్యాన్స్ కంపోజ్ చేయటం కాస్త సులభమే. అయితే, కొన్ని ప్రత్యేక పాటలకు నృత్యాలు సమకూర్చాలంటే అందులో ఎంతో అనుభవం ఉండాలి. డ్యాన్స్పై పట్టు ఉండాలి. పాట వెనుక అర్థం తెలిస్తేనే పాదం సరైన రీతిలో కదులుతుంది. అలాంటి వైవిధ్యమైన పాటకు నృత్యాలు సమకూర్చి మన్నలను పొందిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. అందుకే జాతీయ అవార్డు సైతం ఆయన డ్యాన్స్కు కదిలి వచ్చింది. అయితే, తన కెరీర్లో మర్చిపోలేని చిత్రాలు రెండు ఉన్నాయని శివ శంకర్ మాస్టర్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆ రెండూ తెలుగు చిత్రాలు కావటం గమనార్హం. అందులో ఒకటి అనుష్క నటించిన ‘అరుంధతి’ ఒకటి కాగా.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ రెండోది. కరోనాతో ఆయన ఆదివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆ రెండు చిత్రాల్లోని పాటలకు ఆయన శ్రమించిన విధానాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..
‘అరుంధతి’ కోసం 32 రోజులు
కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘అరుంధతి’. 2009లో వచ్చిన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జేజేమ్మగా అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయితే, పశుపతిగా సోనూసూద్ నటన చూసి భయపడిపోయారు. క్షుద్రమాంత్రికుడైన సోనూసూద్ను అంతం చేయడానికి జేజేమ్మ అయిన అనుష్క చేసే డ్యాన్స్ సీక్వెన్స్ ఎవర్గ్రీన్. ‘భు భు భుజంగం.. ది ది తరంగం’ అంటూ సాగే ఆ పాటను తెరపై చూస్తుంటేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. అలాంటి పాటకు నృత్యాలు సమకూర్చిన ఘనత శివ శంకర్ మాస్టర్ది. దాదాపు 32రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారట. ఆ పాటను ఎలా తెరకెక్కించాలో దర్శకుడు కోడి రామకృష్ణతో పాటు, నిర్మాత శ్యాంప్రసాద్.. శివ శంకర్ మాస్టర్కు ఊహాచిత్రాన్ని ఇచ్చారట. దీంతో అనుష్కకు ప్రాక్టీస్ చేయించడం ప్రారంభించారు. రష్యా నుంచి డూప్ను రప్పించి, అనుష్క ఎలా చేయాలో చేసి చూపించారు. ఆ సమయానికి అనుష్కకు పెద్దగా డ్యాన్స్ రాకపోయినా శివ శంకర్ మాస్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు నృత్య భంగిమలు నేర్పించారు. ఆ తర్వాత ఆమెకు డ్రస్ వేసి, చూసుకునే సరికే ఒకవారం రోజులు పట్టిందని శివశంకర్ ఓ సందర్భంలో చెప్పారు.
సాధారణంగా శివ శంకర్ మాస్టర్ ఒక పాటను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసేవారట. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ధీర ధీర’ పాట పూర్తి చేయడానికి 22 రోజులు పట్టిందట. ఎందుకంటే ఆ పాటను కొంత భాగం రాజస్థాన్లో తీశారు. ఒక ప్రాంతంలో కేవలం ఉప్పు మాత్రమే ఉంటుంది. అక్కడ కొంత భాగాన్ని తెరకెక్కించారు. మళ్లీ ఏడాది తర్వాత రామోజీ ఫిల్మ్సిటీలో సెట్ వేసి, డ్యాన్సర్లతో సహా 15 రోజులు షూట్ చేశారట. అంత శ్రద్ధగా తెరకెక్కించారు కాబట్టే ఆ పాటకు జాతీయ అవార్డు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్