Pawan Kalyan: మహేశ్‌కు పవన్‌ గిఫ్ట్.. ఏం పంపారో తెలుసా?

టాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ ప్రతి పండగకూ పలువురు సినీ తారలకు గిఫ్టులు ఇస్తుంటారు.

Published : 05 Nov 2021 17:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక సందర్భాల్లో పలువురు సినీ తారలకు బహుమతులు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే దీపావళి పండగని పురస్కరించుకుని మహేశ్‌బాబు కుటుంబానికి పవన్‌ దంపతులు స్వీట్లు, పర్యావరణహిత టపాసులను పంపించారు. వీటిని స్వీకరించిన మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియా వేదికగా పవన్‌ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై అటు పవన్‌ అభిమానులు, ఇటు మహేశ్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోల మధ్య స్నేహబంధాన్ని చూసి ఫిదా అవుతున్నారు. అయితే, పవన్‌, మహేశ్‌ మధ్య స్నేహం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో వారిద్దరూ మంచి స్నేహితులు. ఈ అనుబంధంతోనే.. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘జల్సా’ సినిమాకి మహేశ్‌ బాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఇక దర్శకుడు క్రిష్‌కు కూడా పవన్‌ బహుమతులు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని