Tollywood: ప్రాణమంతా... పాన్ ఇండియా
శత దినోత్సవాల సందడులు కనుమరుగయ్యాయి. వందకోట్ల క్లబ్లు మసకబారుతున్నాయి. ఇప్పుడందరి శ్వాస, ధ్యాస ఒకటే.. అదే పాన్ ఇండియా ఇమేజ్. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ.. తమ ప్రతిభను నలుదిశలా వ్యాప్తిచేసి.. కాసులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు కథానాయకులు.
శత దినోత్సవాల సందడులు కనుమరుగయ్యాయి. వందకోట్ల క్లబ్లు మసకబారుతున్నాయి. ఇప్పుడందరి శ్వాస, ధ్యాస ఒకటే.. అదే పాన్ ఇండియా ఇమేజ్. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ.. తమ ప్రతిభను నలుదిశలా వ్యాప్తిచేసి.. కాసులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు కథానాయకులు. పాన్ ఇండియా సంస్కృతిని ఒంటబట్టించుకుని.. వేల కోట్ల క్లబ్బుల్లో కాలు మోపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా అవతరించగా.. ఇప్పుడీ కిరీటం అందిపుచ్చుకునేందుకు మరికొందరు తెలుగు హీరోలు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. మరి కొత్తగా ఈ రేసులోకి అడుగు పెడుతున్న ఆ కథానాయకులెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
కొన్నాళ్లుగా తెలుగు కథానాయకుల మనసంతా పాన్ ఇండియా కథల చుట్టూనే తిరుగుతోంది. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాల స్ఫూర్తితో ప్రభాస్, యష్ తరహాలో పాన్ ఇండియా మార్కెట్ను కొల్లగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కథ కాస్త వైవిధ్యంగా ఉండి.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తే చాలు.. స్టార్ బలాన్ని దించి.. సాంకేతిక హంగులు జోడించి పాన్ ఇండియా సినిమాగా వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు. నలుదిశలా మార్కెట్ విస్తరించే యత్నం చేస్తున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం అనేక మంది తెలుగు హీరోలు ఈ పాన్ ఇండియా బాటలోనే నడుస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో ఇప్పటికే ఈ ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో కథానాయకుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ప్రయత్నానికి పర భాషల్లోనూ మంచి ఆదరణే దక్కింది. ఉత్తరాది వాసుల్ని ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్గా బన్నీ నటనకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలోనే దీనికి కొనసాగింపుగా రానున్న ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మనసులు దోచుకోవడానికి ‘వీరమల్లు’
జయపజయాలతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు పవన్ కల్యాణ్. ఇప్పుడాయన ‘హరి హర వీరమల్లు’తో తన క్రేజ్ను జాతీయ స్థాయికి విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పవన్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా. క్రిష్ తెరకెక్కిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో పవన్ ఓ గజదొంగగా కనిపించనున్నట్లు సమాచారం. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజమౌళి తోడుగా మహేష్
పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు హీరో మహేష్బాబు. ఇప్పుడా బాధ్యతను తన భుజాలకు ఎత్తుకోనున్నారు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన మహేష్తో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అయితే ఇది సెట్స్పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా గాండ్రించాలని..!
తెలుగు సినీప్రియుల మదిలో మాస్రాజాగా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు కథానాయకుడు రవితేజ. ఇప్పుడాయన ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాన్ ఇండియా రేసులో అడుగు పెట్టనున్నారు. స్టూవర్ట్పురంలోని గజ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. 1970 బ్యాక్డ్రాప్లో సాగుతుంది. వంశీ తెరకెక్కించనున్న ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
కుర్ర హీరోల జోరు..
ప్రస్తుతం పాన్ ఇండియా కిరీటం అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్న వారి జాబితాలో పలువురు కుర్రహీరోలు ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘టాక్సీవాలా’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరయ్యారైన హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడాయన్ని ‘లైగర్’తో పాన్ ఇండియా హీరోగా మారుస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమా కోసం మైక్ టైసన్ లాంటి దిగ్గజ క్రీడాకారుడ్ని సెట్స్లోకి దింపారు పూరి. ఈ సినిమా.. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
* ఓ వైపు హీరోగా.. మరోవైపు నిర్మాతగా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నందమూరి కల్యాణ్రామ్. త్వరలో ‘డెవిల్’గా దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని పలకరించనున్నారు. కల్యాణ్రామ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. 1945 కాలం నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో కల్యాణ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్నారు.
* 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా శశికిరణ్ తిక్క తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ పాత్రలో నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలం విడుదల కానుంది. ఇలా దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించే పనిలో మన కథానాయకులున్నారు.
త్వరలో ఇద్దరు వీరుల దండయాత్ర
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడీ ఇమేజ్ను ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ఎన్టీఆర్, రామ్చరణ్. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో రూపొందింది. ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!