Cinema News: ఉత్కంఠభరిత రేసింగ్‌

యువన్‌, రిధాన్‌ కృష్ణ, అనూష సురేష్‌, అమిత్‌ శివదాస్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మడ్డీ’. ప్రగభల్‌  దర్శకుడు. ప్రేమ కృష్ణదాస్‌ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రపంచ

Updated : 29 Nov 2021 10:21 IST

యువన్‌, రిధాన్‌ కృష్ణ, అనూష సురేష్‌, అమిత్‌ శివదాస్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మడ్డీ’. ప్రగభల్‌  దర్శకుడు. ప్రేమ కృష్ణదాస్‌ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని తెలుగులో నిర్మాత దిల్‌రాజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నవంబర్‌ 30న సాయంత్రం 4:30గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు  ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘మడ్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐదేళ్లు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, వినోదం, సాహసం.. ఇలా ప్రతి ఎమోషన్‌ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రధాన నటులకు రోడ్‌ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ ఇచ్చారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్‌ స్వరాలందిస్తున్నారు. కేజీ రతీష్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని