MAA Elections: నాగబాబుకు విష్ణు కౌంటర్: 10 కాదు.. రూ.75వేలు ఇస్తున్నాం!
మా ఎన్నికల్లో ఒక్కో సభ్యుడికి రూ.75వేలు ఇస్తున్నామని, తన తండ్రి మోహన్బాబు, తమ్ముడు మనోజ్, అక్క లక్ష్మికి కూడా ఇచ్చానని సినీ నటుడు
హైదరాబాద్: మా ఎన్నికల్లో ఒక్కో సభ్యుడికి రూ.75వేలు ఇస్తున్నామని, తన తండ్రి మోహన్బాబు, తమ్ముడు మనోజ్, అక్క లక్ష్మికి కూడా ఇచ్చానని సినీ నటుడు, ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు అన్నారు. ‘మంచు విష్ణు ప్యానెల్ ఒక్కో సభ్యుడికి రూ.10వేలు ఇస్తోంది’ అని ఇటీవల నాగబాబు అన్న వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. స్టార్ హీరో మహేశ్బాబుకు రూ.75వేలు గూగుల్ పే చేశానని, ఆయన ఊళ్లో లేకపోవడంతో చూసుకోలేదని వెటకారంగా అన్నారు. ఓటు వేయని వాళ్లను గుర్తు పెట్టుకుని వాళ్ల దగ్గరి నుంచి రూ.75వేలు వెనక్కి తిరిగి తీసుకుంటానని అదే తన అజెండానని మంచు విష్ణు వ్యంగ్యంగా మాట్లాడారు. గురువారం ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్ గెలిస్తే, ఏమేమి చేస్తామో చెబుతూ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ వివరాలు తెలిపిన తర్వాత పలు విషయాలపై విష్ణు మాట్లాడారు.
లోకల్.. నాన్ లోకల్ సమస్య కాదు!
‘‘25 సంవత్సరాల ముందు ‘మా’ స్థాపించినప్పుడు అప్పుడున్న ఛాలెంజెస్ వేరు. మేము ఇప్పుడు అసోసియేట్ మెంబర్స్ సహా 950మంది ఉన్నాం. ఈ సంఖ్య 5వేల వరకూ చేరాలి. భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ యాక్టింగ్ అసోసియేషన్గా ‘మా’ ఉండాలి. అది నా కల. మేము అమలు చేసే పథకాలు వారందరికీ భరోసాను కల్పిస్తాయి. ఇక్కడ లోకల్, నాన్లోకల్ సమస్య కాదు. అవకాశాలు.. ఒక నటుడిగా ఈ ఏడాది నేను బిజీగా ఉండవచ్చు. వచ్చే ఏడాది నాకు మూడు వారాలు కూడా పనిలేకపోవచ్చు. అదే ప్రయారిటీ. చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకమైంది. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారో.. ఎవరిని తిరస్కరిస్తారో తెలియదు. ఒక ప్రొడ్యూసర్ ట్రెండింగ్లో ఉన్న యాక్టర్ను పెట్టుకుంటారు. అతడు ఈరోజు ట్రెండ్లో ఉండవచ్చు. కొన్నాళ్లకు ఆయన ట్రెండ్ ముగియవచ్చు. ‘మా యాప్’ ఎందుకంటే నూటికి 95మంది నటులు తమని తాము ప్రమోట్ చేసుకోలేరు. అందుకే వాళ్లకు సహకరిస్తాం! జాబ్ కమిటీ వచ్చినప్పుడు నిర్మాతలు మాకు సహకరిస్తారని నమ్మకం ఉంది’’
టాలెంట్ ఉంటే ఏ భాష వాళ్లనైనా తీసుకోవచ్చు!
‘‘ఒక క్యారెక్టర్ ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం దర్శకుడిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అతడు క్రియేటర్. ఆయన క్రియేటివిటీని మేము తుంచేయలేం. ఉదాహరణకు జగపతిబాబుగారు అన్ని భాషల్లో ప్రతినాయకుడిగా అదరగొడుతున్నారు. మన మార్కెట్ను పెంచుకోవాలి. ఇతర భాషా నటులను పెట్టుకుంటే మార్కెట్ పరిధి పెరుగుతుందని నిర్మాతలందరూ ఆశిస్తారు. అందులో తప్పులేదు. అదంతా వ్యాపారం. అదే సమయంలో మనవాళ్లకూ అవకాశాలు ఇవ్వండని కోరడంలో తప్పులేదు. ‘ఫలానా నటుడే కావాలి’ అని ఏ హీరో చెప్పడు. భారతదేశంలో ఏ నటుడైనా ఎక్కడైనా నటించవచ్చు. టాలెంట్ ఉంటే తప్పకుండా ఏ భాష వాళ్లైనా తీసుకుంటారు. ఒకప్పుడు తమిళనాడు నుంచి డ్యాన్స్ మాస్టర్లు ఇక్కడకు వచ్చేవాళ్లు. ఇప్పుడు మన డ్యాన్స్ మాస్టర్స్కు భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. క్రియేటివ్ ఇండస్ట్రీలో రిజర్వేషన్ అనేది అసాధ్యం. నా వరకూ అది నాన్సెన్స్’’
అది చాలా పెద్ద సమస్య!
‘‘నిర్మాత అనేవాడు దేవుడు. ఎందుకంటే డబ్బు పెడుతున్నాడు. ఒక నిర్మాతగా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘ఫలానా నటుడిని పెట్టు’ అని అంటే వాళ్ల చేతికి గాలిపటం ఇచ్చి వెళ్లి ఎగరేసుకో అని చెబుతా. ‘మా’ సభ్యత్వం విస్తృతమైంది. ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ అనేది అమెరికాలో ఉంది. అది పవర్ఫుల్ అసోసియేషన్. అన్నీ నాకు తెలుసని నేను చెప్పను. అక్కడున్న పాలసీలు మన వాతావరణానికి ఏవి సరిపోతాయో వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అసోసియేషన్లో ఉన్న నియమ, నిబంధలను అనువుగా తీసుకుని ‘మా’ అసోసియేషన్ లోపలికి వచ్చి కొందరు మా మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు. నేను వచ్చిన తర్వాత అది లేకుండా చేస్తా! రవిబాబు ఒక రాడికల్ వ్యక్తి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా వరకూ నిజం ఉంది. ‘కేవలం మన భాషా నటులను మాత్రమే తీసుకోవాలి’ అనేది చాలా పెద్ద సమస్య. దాన్ని పరిష్కరించాలంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటవ్వాలి. మనం బయట నుంచి టాలెంట్ను ఎందుకు తీస్తామో ఇంతకుముందే చెప్పాం. ఆ అవసరం రాకూడదనే ‘మోహన్బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ స్థాపిస్తున్నాం.’’ అని మంచు విష్ణు అన్నారు. ఇక ‘‘ప్రకాశ్రాజ్ మూడుసార్లు ‘మా’కు అధ్యక్షుడిగా ఉండాలి. ఆయన ఉంటేనే ‘మా’ బాగుపడుతుంది’’ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమని మంచు విష్ణు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
తన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెమెరామెన్ చోటా కె నాయుడిని ఉద్దేశిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ లేఖ విడుదల చేశారు. -
నాలుగు క్యారవాన్లు ఇస్తే కానీ సెట్లోకి రారు : సెలబ్రిటీల తీరుపై దర్శకురాలు కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ తారలను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకురాలు పరాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్గా మారాయి. -
వాళ్ల పార్టీలకు వెళ్లకపోవడం వల్లే మంచి అవకాశాలు రాలేదు: పరిణీతి చోప్రా
తన పీఆర్ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు నటి పరిణీతి చోప్రా చెప్పారు. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి మాట్లాడుతూ.. తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. -
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు