MAA Elections: ‘మా’ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు

‘మా’ఎన్నికల్లో తమ ప్యానెల్‌ విజయం సాధిస్తే రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడిన అర్హులైన ఆర్టిస్ట్‌లకు సొంత ఇల్లు వచ్చే చేస్తామని సినీ నటుడు, ‘

Updated : 07 Oct 2021 16:20 IST

హైదరాబాద్‌: ‘మా’ఎన్నికల్లో తమ ప్యానెల్‌ విజయం సాధిస్తే రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడిన అర్హులైన ఆర్టిస్ట్‌లకు సొంత ఇల్లు వచ్చేలా చేస్తామని, అదే విధంగా సొంత ఖర్చులతో ‘మా’ నూతన భవనం నిర్మిస్తామని సినీ నటుడు, ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు తన ప్యానెల్‌కు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు.

విష్ణు ప్యానెల్‌ విడుదల చేసిన మేనిఫెస్ట్లోని ముఖ్యాంశాలు

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్‌’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్‌ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తాం!

* ‘జాబ్‌ కమిటీ’ ద్వారా వారందరికీ సినిమాలు, ఓటీటీ వంటి మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం!

* తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా సొంత డబ్బులతో ‘మా’ భవన నిర్మాణం.

* అర్హులైన ‘మా’ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం.

* ‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడికీ, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా. ‘మా’ సభ్యుడికి ఉచితంగా ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు.

* అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకూ విద్యా సాయం.

* ‘మా’ మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణకోసం హైపవర్‌ కమిటీ.

* అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రతి నెలా పెన్షన్‌ అందేలా చర్యలు. అలాగే రూ.6000 పెన్షన్‌ గణనీయంగా పెంచే ఏర్పాటు.

* గౌరవ సభ్యుత్వం ఇచ్చిన సీనియర్‌ సిటిజన్స్‌కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం.

* కొత్తగా ‘మా’ మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి రూ.75వేలకే సభ్యత్వం

* ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టడానికి ఒక కల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఏర్పాటు.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి.

* ‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి ఉంటే వారికి ‘మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ ద్వారా 50శాతం స్కాలర్‌షిప్‌తో శిక్షణ.

* తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చలన చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని