Gopichand Aaradugula Bullet Review: రివ్యూ: ఆరడుగుల బుల్లెట్
గోపీచంద్-నయనతార జంటగా నటించిన ఆరడుగుల బుల్లెట్ ఎలా ఉందంటే
చిత్రం: ఆరడుగుల బుల్లెట్; నటీనటులు: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు తదితరులు; కథ,కథనం: వక్కంతం వంశీ; సంగీతం: మణిశర్మ; ఛాయాగ్రహణం: బాల మురుగన్; కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు; నిర్మాత: తాండ్ర రమేష్; దర్శకుడు: బి.గోపాల్; బ్యానర్: జయ బాలాజీ రియల్ మీడియా; విడుదల: 8 అక్టోబర్ 2021
ఏళ్ల తరబడి సెట్స్పై మగ్గే సినిమాలు కొన్ని ఉంటాయి. రకరకాల కారణాలతో ఎప్పుడో మొదలై, ఇంకెప్పుడో అవి ప్రేక్షకుల ముందుకొస్తాయి. అలాంటి చిత్రమే.. ‘ఆరడుగుల బుల్లెట్’. నాలుగేళ్లుగా పలుసార్లు విడుదల తేదీల్ని మార్చుకున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గోపీచంద్ కథానాయకుడు కావడం, బి.గోపాల్ దర్శకత్వం వహించడం, వక్కంతం వంశీ, అబ్బూరి రవి, మణిశర్మ తదితరులు ఈ సినిమాలో భాగం కావడంతో ఎంత ఆలస్యమైనా ఒకింత ఆసక్తిని రేకెత్తించింది. మరి చిత్రం ఎలా ఉందో చూద్దామా..
కథేంటంటే: నిజాయతీకి మారుపేరైన ఓ ప్రభుత్వ ఉద్యోగి మూర్తి (ప్రకాశ్రాజ్). అతడి కుమారుడే శివ (గోపీచంద్). కుటుంబంపై ప్రేమ తప్ప.. మిగతా బాధ్యతలేవీ పట్టని యువకుడు శివ. వయసొచ్చిన కొడుకు అలా ఏ పనీ లేకుండా తిరగడం తండ్రికి అస్సలు నచ్చదు. ఎంత చెప్పినా అతడిలో మార్పు రాదు సరికదా, నయనతో (నయనతార) ప్రేమలో పడతాడు. ఏం యోగ్యత ఉందని ప్రేమించావ్?అంటూ ప్రేయసి ముందే శివని అవమానిస్తాడు తండ్రి మూర్తి. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి పంపేస్తాడు. ఇంతలో కాశీ (అభిమన్యు సింగ్) అనే ఓ రౌడీ నుంచి మూర్తికి ముప్పు ఏర్పడుతుంది. అసలు వారిద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది? తన తండ్రి సమస్యల్లో ఉన్నాడని తెలిశాక శివ స్పందన ఏమిటి? తనని వద్దనుకున్న కుటుంబం కోసం ఎలా పోరాటం చేశాడనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: ట్రెండ్ మాటెలా ఉన్నా.. అన్నీ అనుకున్నట్టు కుదిరాయంటే మాస్ సినిమాలకి బాక్సాఫీసు దగ్గర తిరుగుండదు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘క్రాక్’ వరకూ కూడా ఆ విషయాన్ని తరచూ ఏదో ఒక సినిమా నిరూపిస్తూనే ఉంది. కథానాయకులు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో కూడిన మాస్ కథలపై మొగ్గు చూపుతున్నారంటే కారణం కూడా అదే. మాస్ కథల్లో లాజిక్ల గురించి ప్రేక్షకుడు కూడా అంతగా పట్టించుకోడు. హీరోయిజం మోతాదు ఎంతున్నా, పాట తర్వాత ఫైటు, ఆ తర్వాత ఓ కామెడీ సీన్ వంటి లెక్కలతో సన్నివేశాలు సాగుతున్నా ప్రేక్షకుడు ఓకే చేసేస్తాడు. కాకపోతే కథో, కథానేపథ్యమో ఏదో ఒక విషయం కొత్తగా ఉండాలనుకుంటాడు. ఈ సినిమాలో మాత్రం అవేవీ కనిపించవు. కథ మొదలుకొని కామెడీ సన్నివేశాల వరకూ ప్రతిదీ.. ఎన్నో సినిమాల్లో చూశాం అన్నట్లుగానే ఉంటుంది.
తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. తండ్రి చీవాట్లు పెట్టడం, కొడుకు పడటం, పట్టించుకోకుండా తిరగడం, ఆ తర్వాత కథానాయికతో ప్రేమలో పడటం.. ఇలా సగటు తండ్రీ కొడుకుల సినిమాల్లాగే సాగుతుంది. అందులో కొత్తదనమేమీ లేదు. కథానాయకుడి తండ్రికి.. రౌడీ నుంచి సమస్య వచ్చినప్పుడే అసలు కథ మొదలైనట్టు అనిపిస్తుంది. కానీ, ఆ ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని బలంగా ఆవిష్కరించలేకపోయారు. ఆ రౌడీ పాత్రలో ఏమాత్రం బలం లేకపోవడంతో హీరోయిజం కూడా నీరుగారిపోయినట్టైంది. ప్రేమ సన్నివేశాల్లోనూ, కామెడీ ట్రాకుల్లోనూ కొత్తదనం లేదు. కుటుంబ నేపథ్యం అన్నప్పుడు భావోద్వేగాలు కీలకం. కానీ తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో భావోద్వేగాలు పండలేదు. కొద్దిలో కొద్దిగా గోపీచంద్ - నయనతార జోడీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. గోపీచంద్ చేసే పోరాటాలు, ఆయన కనిపించే తీరు కూడా మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే: గోపీచంద్కి అలవాటైన పాత్రే. ఇందులో ఆయన మరింత హుషారుగా కనిపిస్తాడు. అందంగా కూడా కనిపించాడు. పోరాట ఘట్టాలతోనూ అలరించాడు. నయనతార పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల కోసమే అన్నట్టుగా ఆమె పాత్ర సాగుతుంటుంది. పాటల్లోనూ, కొన్ని ప్రేమ సన్నివేశాల్లోనూ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అలరిస్తుంది. ప్రకాశ్రాజ్కి ఈ పాత్ర కొత్తదేమీ కాదు. తనదైన శైలిలో ప్రభావం చూపించారు. అభిమన్యు సింగ్ విలనిజంలో పసలేదు. ఆ పాత్ర లోపమే అది. హాస్యనటులు ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్రెడ్డి ఇందులో కనిపిస్తారు. ఎమ్మెస్ నారాయణ పాత్రకి మరొకరితో డబ్బింగ్ చెప్పించడంతో అది అంతగా అతకలేదు. బ్రహ్మానందం కాలం చెల్లిన కామెడీ సన్నివేశాల్లో కనిపిస్తారు. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. బలమైన సాంకేతిక బృందమే పనిచేసింది. వక్కంతం వంశీ కథలోనూ, కథనంలోనూ బలం లేదు. అబ్బూరి రవి మాటలు అక్కడక్కడా పర్వాలేదనిపిస్తాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. బి.గోపాల్ మేకింగ్ కథకి తగ్గట్టే ఉంటుంది. కథల్ని ఎంచుకోవడంలోనూ, కథనాన్ని నడిపించడంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ తరం ప్రేక్షకుల్ని మెప్పించలేమనే విషయం ఆయనకి మరోమారు అర్థమయ్యేలా చేస్తుందీ చిత్రం.
బలాలు
+ గోపీచంద్ - నయనతార జోడీ
+ ప్రథమార్ధం
+ పోరాట ఘట్టాలు
బలహీనతలు
- రొటీన్గా సాగే కథ, కథనం
- భావోద్వేగాలు
చివరిగా: గురి తప్పిన బుల్లెట్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత