Jabardasth: ‘జబర్దస్త్’ నటులు.. కన్నీటి వ్యథలు
‘ఎక్స్ట్రా జబర్దస్త్’ తాజా ఎపిసోడ్ ప్రోమో. రష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘బజర్దస్త్’ నటులు సుధీర్, శ్రీను, నరేశ్.. తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వాగదు. అంతగా తమని తాము మలుచుకున్నారు. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇదంతా అంత తేలికగా సాధ్యంకాలేదు. వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.. నీళ్లతోనే కడుపు నింపుకున్నారు. తెర వెనక వీళ్లు పడిన ఆ కష్టాల్ని కార్తీక్, ఇమ్మాన్యుయేల్, నూకరాజు ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ వేదికగా తెరపైకి తీసుకొచ్చారు. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ 350వ ఎపిసోడ్కి చేరుకుంది. సెప్టెంబరు 3న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఓ వైపు ఆనందం, అల్లరి.. మరోవైపు కంటతడి పెట్టించే సన్నివేశాలు ఈ ప్రోమోలో ఉన్నాయి. రాకింగ్ రాకేశ్, రోహిణి భార్యభర్తలుగా నవ్వులు పంచగా.. జగదేక వీరుడు- అతిలోక సుందరిలా రామ్ ప్రసాద్- శ్రీను, అమ్రిష్ పురిలా సుధీర్ దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. బుల్లెట్ భాస్కర్- వర్ష జోడీ సందడి చేసింది. రాము, కుటుంబ సభ్యులు.. హరికృష్ణ, సతీమణి.. హరి, సోదరి.. సాయి, వాళ్ల నాన్న తళుక్కున మెరిశారు. తన తల్లి ఎంతో కష్టపడి తన తండ్రిని బతికించిందని చెప్పి సాయి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘బజర్దస్త్ ఆర్టిస్టుల లైఫ్ జర్నీ స్కిట్’ పేరుతో నరేశ్ తాను ఎదుర్కొన్న అవమానాల్ని చూపించాడు. సుధీర్, శ్రీను పడిన కష్టాల్ని కార్తీక్, ఇమ్మాన్యుయేల్ కళ్లకు కట్టినట్టు చూపించారు. హృదయాన్ని బరువెక్కించారు. మరి సుధీర్, శ్రీను ఈ స్కిట్పై ఎలా స్పందించారో తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్