Acharya: ముందుంది ‘ఆచార్య’ పండగ.. ఇంకో రెండు సర్ప్రైజ్లు ఉన్నాయ్!
చిరంజీవి, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్కి జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చిరంజీవి, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్కి జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇటీవల ‘సిద్ధ సాగా’ పేరుతో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది. అందులోని చివరి షాట్ (ఒక వైపు చిరుతలు.. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్ కనిపించిన సన్నివేశం) సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ సీన్, సినిమా గురించి కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..
* టీజర్తోనే ‘ఆచార్య’ సినిమాపై అంచనాలు పెంచేశారు? ఆ ఆలోచన ఎలా వచ్చింది?
కొరటాల శివ: ఇది ధర్మం చుట్టూ తిరిగే కథ. ధర్మానికి ప్రతిరూపం సిద్ధ (రామ్ చరణ్ పాత్ర). కథని, పాత్రను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు శాంతి శ్లోకంతో టీజర్ను ప్రారంభించాలనుకున్నా. నా ఆలోచనను సంగీత దర్శకుడు మణిశర్మతో పంచుకోగానే ‘చాలా బాగుంటుంది. దానితోనే మొదలుపెట్టు’ అని అన్నారు. అలా ‘సహనాభవతు’ శ్లోకంతో సిద్ధ టీజర్ను తీర్చిదిద్దాం. సిద్ధ పాత్రను పరిచయం చేసి విజువల్ ట్రీట్ కోసం చివరి షాట్లో చిరంజీవి, రామ్ చరణ్ని ఓ వైపు, చిరుతల్ని మరోవైపు చూపించాం. సినిమాలో ఇదో అద్భుతమైన దృశ్యం. అది వాళ్లిద్దరికే సరిగ్గా సరిపోయింది. అదృష్టవశాత్తూ అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఉండటంతో ఆ షాట్ను అందించగలిగా. దాన్ని చిత్రీకరించేటప్పుడు దర్శకుడిగా కాకుండా ఓ అభిమానిగా ఎంతో ఆనందించా.
* సాధారణంగా ఆచార్య దేవోభవ అని వింటుంటాం. ఆచార్య రక్షోభవ గురించి మీ మాటల్లో..
కొరటాల శివ: ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ ఆచార్య ఉంటాడు. తల్లి, తండ్రి, గురువు.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఆచార్యను మనం దైవమని నమ్మితే వారే మనల్ని రక్షిస్తారు. ఆ ఆలోచనతోనే ఈ కథను రాసుకున్నా. అందుకే టీజర్లో ఆచార్య దేవోభవతోపాటు ఆచార్య రక్షోభవ అని వినిపిస్తుంది. ఓ అభిమానిగా చిరంజీవిగారిని తెరపై ఎలా చూడాలనుకున్నానో అలా చూపించే ప్రయత్నం చేశా. ఈ చిత్రం ఆయన అభిమానులే కాదు సినీ ప్రియులందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.
* కథ పూర్తయ్యాక హీరోని ఎంపిక చేసుకుంటారా? హీరోని దృష్టిలో పెట్టుకుని కథను రాస్తుంటారా?
కొరటాల శివ: ముందుగా కాన్సెప్ట్ని సిద్ధం చేసుకుని దానికి న్యాయం చేయగలిగే నటుడ్ని ఎంపిక చేసుకుంటా. తర్వాత వారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కథను పూర్తి చేస్తా. అలా అని మరీ ఎక్కువగా కమర్షియల్ హంగులు జొప్పించను. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. ‘ఆచార్య’ విషయంలోనూ అంతే. చిరంజీవిగారికి ఈ కథకు సంబంధించి ఓ లైన్ వినిపించా. విన్న వెంటనే ఓకే చెప్పారు. తన పాత్ర గురించి చెప్పగానే రామ్ చరణ్ కూడా వెంటనే నటిస్తా అన్నాడు. ఈ సినిమాకు రామ్ చరణ్ బోనస్.
* ఇద్దరు అగ్ర హీరోల్ని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది?
కొరటాల శివ: కథ రాసినప్పుడు ఏం అనిపించలేదు గానీ ఈ ఇద్దరు హీరోలు (చిరంజీవి, రామ్ చరణ్) ఒప్పుకున్న తర్వాత కాస్త టెన్షన్ పడ్డా. ‘ఇద్దరికీ న్యాయం చేయాలి. పూర్తిస్థాయి పాత్రల్లో వారిద్దరూ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రమిది. భవిష్యత్లో చేస్తారో లేదో తెలియదు. మనం బాగా చూపించాలి’ అని ఒత్తిడికి గురయ్యేవాడ్ని. నా భయాన్ని గమనించిన చిరంజీవి, రామ్ చరణ్ ‘మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఆచార్య, సిద్ధ పాత్రల్ని మాత్రమే మైండ్లో పెట్టుకోండి. చిరంజీవి, రామ్ చరణ్లని చూడకండి’ అని ధైర్యాన్నిచ్చారు. ఇద్దరూ కనిపించే కొన్ని సన్నివేశాల్ని మారేడుమిల్లి అడవుల్లో 15 రోజులు షూట్ చేశాం. ఆ క్షణాల్ని ఎప్పటికీ మరిచిపోలేను. వారిద్దరినీ చూసి నేనూ చిత్ర బృందమంతా మురిసిపోయేవాళ్లం.
* ‘ధర్మస్థలి’ గురించి వివరిస్తారా?
కొరటాల శివ: ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ సినిమా ధర్మం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది. అంతర్లీనంగా ఓ గుడి, ఓ గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఈ టెంపుల్ టౌన్కే ‘ధర్మస్థలి’ అని పేరు పెట్టాం. ఇలాంటి లొకేషన్ కోసం చాలాచోట్ల తిరిగాం. కానీ ఏదీ మాకు అనువైన ప్రదేశమనిపించలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిరంజీవిగారు ఓ సలహా ఇచ్చారు. హైదరాబాద్ నగర శివారులో తనకున్న ఖాళీ స్థలంలో ‘ధర్మస్థలి’ సెట్ను రూపొందించమన్నారు. ఆర్ట్ డైరెక్టర్, ఇతర టెక్నిషియన్ల వల్ల అద్భుతమైన దేవాలయం దర్శనమిచ్చింది. దాన్ని చూసిన చిరంజీవి ఆశ్చర్యపోయారు. సుమారు 70 శాతం చిత్రీకరణ ఆ సెట్లోనే పూర్తి చేశాం. ఇంతటి భారీ సెట్ ఈమధ్య కాలంలో ఏ సినిమాలోనూ కనిపించి ఉండదు.
* ఈ సినిమా నుంచి ఇంకా ఏ సర్ప్రైజ్లు రానున్నాయి?
కొరటాల శివ: రెండు పెద్ద సర్ప్రైజ్లు త్వరలోనే వస్తాయి. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ చేసిన ఓ పాట, ట్రైలర్ను విడుదల చేస్తాం. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఇప్పటి వరకూ ఫుల్ సాంగ్కు నృత్యం చేయలేదు. అది చూస్తే అభిమానులకు పండగే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ