Sunil Shetty: డ్రగ్స్ కేస్‌లో దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచిచూడాలి..

సంచలనంగా మారిన ముంబయి డ్రగ్స్‌ కేస్‌ విషయంపై బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి స్పందించారు. ఈ కేసులో పట్టుబడ్డ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ సహా మిగతా కుర్రాళ్ల విషయంలో దర్యాప్తు వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు.

Published : 04 Oct 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంచలనంగా మారిన ముంబయి డ్రగ్స్‌ కేస్‌ విషయంపై బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి స్పందించారు. ఈ కేసులో పట్టుబడ్డ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ సహా మిగతా కుర్రాళ్ల విషయంలో దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. నిజమైన నివేదిక వచ్చిన తర్వాతే ఓ అంచనాకి రావాలన్నారు. ఎవరైనా ఇలాంటి కేసుల్లో పట్డుబడితే అనేక రకాలుగా ఊహించుకోవడం సహజమని పేర్కొన్నారు. కుర్రాళ్లని సంరక్షించుకోవడం మన బాధ్యత అని అన్నారు. ముంబయి నగర శివారులోని తీరప్రాంతంలో క్రూజ్‌ నౌకపై శనివారం నిర్వహించిన ఓ రేవ్‌పార్టీలో ఆర్యన్‌తోపాటు మరికొందరు హాజరయ్యారు. అక్కడ మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌. సి.బి) అధికారులు సోదా చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్యన్‌తో సహా పలువురిని అరెస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని