Bigg boss telugu 5: ఆ ఇద్దరు తప్ప మిగిలిన వాళ్లందరూ నామినేట్.. కారణాలివే!
Bigg boss telugu 5: ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయింది వీళ్లే!
హైదరాబాద్: ఎవరూ ఊహించని విధంగా రవి(Ravi) ఇంటి నుంచి వెళ్లిపోయిన దానిపై బిగ్బాస్(Bigg Boss telugu 5) హౌస్ మేట్స్ మాట్లాడుకున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్తో కాకుండా జనం ఓట్లతో తాను సేవ్ అయ్యాయనని, అందుకు సంతోషంగా ఉందని మానస్(manas)తో కాజల్(Kajal) అన్నది. రవి వెళ్లిపోతుంటే చాలా బాధగా అనిపించిందని సిరి(siri)-షణ్ముఖ్(shanmukh) మాట్లాడుకున్నారు. శ్రీరామ్(sri ram)కు స్నేహితులుగా ఉన్న వారందరూ వెళ్లిపోయారని, తనని ఒంటరిగా వదలకూడదని అనుకున్నారు. ఇక రవి వెళ్లేవరకూ ఏడ్చిన సన్నీ(sunny), అతడు వెళ్లిపోగానే కాజల్తో కలిసి జోకులు వేసి, నవ్వుకున్నారని షణ్ముఖ్ అన్నాడు. ‘టఫ్ కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మాకు పోటీ తగ్గింది’ అని వాళ్లు అనుకుంటున్నట్లు ఉన్నారు అని సిరి చెప్పుకొచ్చింది. ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారంటూ సన్నీ-కాజల్ మాట్లాడుకున్నారు.
‘నువ్వుంటే అందరికీ ఇష్టం. నిన్ను నామినేట్ చేయరు’ అని సన్నీతో కాజల్ చెప్పింది. రవి వెళ్లిపోయిన దాన్ని గుర్తు చేసుకుని కిచెన్లో ఒంటరిగా ఉన్న ప్రియాంక(Priyanka) ఏడ్చింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన సిరి ఆమెను ఓదార్చింది. ఆ తర్వాత బెడ్ రూమ్లో ఉన్న ప్రియాంకతో షణ్ముఖ్ మాట్లాడాడు. ‘సన్నీ, కాజల్, మానస్లు నిన్ను నామినేట్ చేస్తారు. హౌస్లో శ్రీరామ్, నేను, సిరి లేకపోతే వాళ్లు తప్పకుండా నిన్నే ఎంచుకుంటారు. వాళ్ల ప్లాన్ అదే. ఈవిషయం నీకు అర్థం కావటం లేదు.’ అంటూ ప్రియాంకతో షణ్ముఖ్ చెప్పాడు. ‘కాజల్ నన్ను నామినేట్ చేస్తే తప్పకుండా ఆమెను చేస్తా’ అంటూ ప్రియాంక చెప్పగా, ‘సరైన కారణం చెబితే బాగుంటుంది’ అని షణ్ను అన్నాడు.
నాకు హగ్గు వద్దు బాబోయ్
‘సిరి-షణ్ముఖ్ హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు’ అని సిరి తల్లి అన్న మాట చాలా గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. షణ్ముఖ్, సిరి, కాజల్, మానస్ కలిసి మాట్లాడుకుంటుగా, సిరిపై షణ్ను నాలుగైదు పంచ్లు వేశాడు. దీంతో అలిగి వెళ్లిపోయిన ఆమె మోజ్ రూమ్లో కూర్చొంది. అక్కడకు వచ్చిన షణ్ను ఆమెకు సారీ చెప్పాడు. దీంతో సిరి హగ్ చేసుకునేందుకు ప్రయత్నించగా ‘నాకు హగ్ వద్దు బాబోయ్’ అని షణ్ముఖ్ అన్నా కూడా సిరి వదిలి పెట్టలేదు. కుర్చీలో కూర్చొన్న అతడిని లేపి మరీ హగ్ చేసుకుంది. ‘ఆంటీ ఇది కేవలం ఫ్రెండ్షిప్తో చేసుకున్న హగ్మాత్రమే’ అని షణ్ముఖ్ చెప్పడం గమనార్హం.
ఈ వారం నామినేషన్కు కారణాలివే!
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ ఫొటోలు ఉన్న బాల్స్ని కంటెస్టెంట్స్ అందరికీ ఇచ్చిన బిగ్బాస్.. ఇంటి మెయిన్ గేట్లను తెరిచాడు. ఎవరికైతే ఇంటిలో కొనసాగే అర్హత లేదని భావిస్తారో వాళ్ల ఫొటోలతో ఉన్న బాల్స్ని ఆ గేట్ అవతలికి వెళ్లేలా తన్నాలి అని ఆదేశించాడు. మొదట నామినేషన్ ప్రక్రియను షణ్ముఖ్ ప్రారంభించాడు. ‘కమ్యూనిటీ, క్యాస్ట్, రిలీజియన్ గురించి ఇలాంటి వేదికలపై మాట్లాడకూడదు. కానీ నువ్వు మాట్లాడావు. అందుకే నువ్వు వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి అని అన్నాను’ అంటూ కాజల్ను, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటావంటూ ప్రియాంకను షణ్ముఖ్ నామినేట్ చేశాడు. ఎవరిని నామినేట్ చేయాలా? అన్నదానిపై ప్రియాంక తర్జన భర్జన పడింది. దీంతో ‘ఎవరినీ నామినేట్ చేయకపోతే నువ్వు నేరుగా నామినేట్ అవుతా’వని బిగ్బాస్ హెచ్చరించాడు. దీంతో సిరి, కాజల్లను ప్రియాంక నామినేట్ చేసింది.
‘మానస్ అనుకున్నది అనేస్తాడు. ఎదుటి వాళ్లు మాట్లాడితే మాత్రం ఎదురు మాట్లాడకూడదు. నువ్వు హౌస్ నుంచి బయటకు వెళ్తే నాకు ఫరక్ పడదు అని అనడం నాకు నచ్చలేదు’ అంటూ మానస్ను, ‘కిచెన్లో ఉండగా బయటకు వెళ్లు’ అనడం నచ్చలేదంటూ కాజల్ను శ్రీరామ్ నామినేట్ చేశాడు.‘నియంత’ టాస్క్లో తనని డిస్క్ క్వాలిఫై చేసినందుకు ప్రతిగా ప్రియాంకను, ‘కమ్యూనిటీ’ అనే పదం వాడినందుకు రెండో వ్యక్తిగా కాజల్ బంతిని సిరి గేటు బయటకు తన్నింది. ‘నియంత’ టాస్క్లో తనని డిస్ క్వాలిఫై చేసినందుకు సిరిని సన్నీ నామినేట్ చేశాడు. శ్రీరామ్తో తనకు బాండింగ్ తక్కువగా ఉందంటూ అతడి బంతిని గేటు బయటకు తన్నాడు. ‘శ్రీరామ్ మాట తీరు సరిగా లేదు’ అంటూ అతడిని, ‘ప్రియాంకను గెలిపించుకోవాలంటే గెలిపించుకో’ అంటూ తనని అన్నందుకు సిరిని మానస్ నామినేట్ చేశాడు. చివరిగా కాజల్ ప్రియాంక, సిరిలను నామినేట్ చేసింది. ‘కమ్యూనిటీ’ అనే పదంపై మరోసారి హౌస్మేట్స్ మధ్య చర్చ జరిగింది. అలా ఈ వారం నామినేషన్స్లో ప్రియాంక, సిరి, మానస్, శ్రీరామ్, కాజల్లు ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా షణ్ముఖ్, ఎవరూ నామినేట్ చేయకపోవడంతో సన్నీ ఈ వారం నామినేషన్లో లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్