Tollywood Drugs Case: తరుణ్‌ను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు బుధవారం ఉదయం నటుడు తరుణ్‌ హాజరైన సంగతి తెలిసిందే. సుమారు 7 గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయన్ను ప్రశ్నించారు....

Published : 22 Sep 2021 18:40 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు బుధవారం ఉదయం నటుడు తరుణ్‌ హాజరైన సంగతి తెలిసిందే. సుమారు 7 గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. మనీలాండరింగ్‌ కోణంలో తరుణ్‌ బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీశారు. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించినట్లు సమాచారం.

మనీ లాండరింగ్‌ కోణంలో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చిన ఈడీ.. గత కొన్ని రోజుల నుంచి వారిని ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు పూరీ జగన్నాథ్‌, రానా, ఛార్మి, నవదీప్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవితేజ.. ఇలా మొత్తం 11 మంది సెలబ్రిటీలను ఈడీ సుధీర్ఘంగా విచారించి.. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు