Pakka Commercial: పక్కా ప్రణాళికతో...

యువతరంతో పాటు...స్టార్‌ కథానాయకులతోనూ సినిమాలు చేసి విజయాల్ని అందుకుంటున్నారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం గోపీచంద్‌ కథానాయకుడిగా ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోపక్క కరోనా విరామంలో కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసిన ‘మంచి రోజులు వచ్చాయి

Updated : 08 Oct 2021 07:17 IST

యువతరంతో పాటు...స్టార్‌ కథానాయకులతోనూ సినిమాలు చేసి విజయాల్ని అందుకుంటున్నారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం గోపీచంద్‌ కథానాయకుడిగా ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోపక్క కరోనా విరామంలో కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసిన ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. తదుపరి చిత్రం కోసం కూడా ఆయన పక్కా ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది. అగ్ర కథా నాయకుడు చిరంజీవి కోసం మారుతి కథని సిద్ధం చేసి వినిపించారని సమాచారం. ఆ కలయికలో సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం మారుతి పుట్టినరోజు. ‘పక్కా కమర్షియల్‌’ సెట్లో చిత్రబృందం సమక్షంలో వేడుక జరిగింది. ఈ వేడుకలో రాశీ ఖన్నా, గోపీచంద్‌, సత్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని