Vijay Devarakonda: నాకంటే ముందు నా తమ్ముడు ఆనంద్కే పెళ్లి
తనకంటే ముందు తన సోదరుడు ఆనంద్కే వివాహం జరుగుతుందని టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన...
హైదరాబాద్: తనకంటే ముందు తన సోదరుడు ఆనంద్కే వివాహం జరుగుతుందని టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్పకవిమానం’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమాలో ఆనంద్ అమాయకుడైన యువకుడి పాత్రలో నటించారు. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహించారు. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దేవరకొండ బ్రదర్స్ ఓ స్పెషల్ చిట్చాట్లో పాల్గొన్నారు. తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అన్నదమ్ములిద్దరూ సరదాగా పంచుకున్నారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ తాజాగా విజయ్ ఓ స్పెషల్ ప్రోమో షేర్ చేశారు.
‘‘స్కూల్లో చదువుకునే రోజుల్లో వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. రెండు నెలలు ఇంట్లోనే సరదాగా ఉండేవాళ్లం. ఆనంద్ మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు. నన్ను బాగా విసిగించేవాడు’’ అని విజయ్ చెప్పగానే.. ఆనంద్ నవ్వులు పూయించారు. అనంతరం విజయ్.. ‘‘నాకంటే ముందు ఆనంద్కే పెళ్లి అవుతుంది’’ అనగానే.. ‘‘నో అన్నయ్యకే ముందు’’ అని ఆనంద్ సైగలు చేశారు. ‘‘అమ్మ ఫెవరెట్ ఎవరు’’ అనేదానికి సమాధానం చెబుతూ.. తానే అన్నట్లు ఇద్దరూ సమాధానం ఇచ్చుకున్నారు. ఇలా, ఎంతో సరదాగా సాగిన దేవరకొండ సోదరుల ఫన్నీ ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే. రేపు ఈ వీడియో విడుదల చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..