Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
‘పుష్ప’ తర్వాత దర్శకుడు సుకుమార్-రామ్చరణ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని టాలీవుడ్ టాక్
ఇంటర్నెట్డెస్క్: అల్లు అర్జున్తో ‘పుష్ప’ తర్వాత దర్శకుడు సుకుమార్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. సుకుమార్-విజయ్ల సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను చిత్ర వర్గాలు ఖండించాయి. సినిమా ఆగిపోలేదని, తాత్కాలికంగా వాయిదా పడినట్లు చెబుతున్నారు.
మరి ‘పుష్ప’ తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తారు? అని అడిగితే, రామ్చరణ్తో చేస్తారని గట్టిగా టాక్ వినపడుతోంది. ఇప్పటికే కథ విషయంలో ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చరణ్తో సినిమా అయిన తర్వాతే సుక్కు-విజయ్ దేవరకొండ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కథానాయకులు, దర్శకుల కాంబినేషన్లు తారుమారు అవుతున్నాయి. మరి మన లెక్కల మాస్టార్ సుకుమార్ తర్వాతి ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక