Samantha: చైతో విడిపోయిన తర్వాత జోరు పెంచిన సమంత..!

నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించి.. ఇటీవల టాలీవుడ్‌లో సంచలనంగా మారింది సమంత. చైతో విడిపోవడం తన తప్పే అని ఎంత మంది నిందిస్తున్నా.. అవన్నీ పక్కనపెట్టి కెరీర్‌లో దూసుకెళ్లాలని సమంత భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో

Published : 17 Oct 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత కెరీర్‌ పరంగా వడివడిగా అడుగులు వేస్తోంది సమంత. ప్రస్తుతం గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’లో నటిస్తోన్న ఆమె.. మరో రెండు కొత్త చిత్రాలకు ఓకే చెప్పేసింది. దసరా సందర్భంగా ఆ చిత్ర బృందాల నుంచి అధికారిక ప్రకటనలు వెలుబడ్డాయి.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న 30వ సినిమాలో సమంత నటించబోతుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ తెరకెక్కించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా వేదికగా వెల్లడిస్తూ సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 

శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలోనూ సమంత నటించనుంది. ఈ చిత్రానికి హరి, హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్నారు. వీరికి ఇదే తొలి సినిమా. నవంబర్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని