Salman Khan: ‘హిట్ కొట్టినా.. నాలుగైదు నెలలు అవకాశాలే రాలేదు’
ఒక చిత్రం హిట్ కొట్టగానే అందులో నటించిన నటులకు వరుసపెట్టి అవకాశాలు వస్తుంటాయి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం.. చేసుకోకపోవడం వేరే విషయం. కానీ, పాపం సల్మాన్ఖాన్.. తను హీరోగా నటించిన తొలి చిత్రం ‘మైనే ప్యార్ కియా’ బ్లాక్బాస్టర్ హిట్ కొట్టినా.. కొన్ని
ఇంటర్నెట్ డెస్క్: ఒక చిత్రం హిట్ కొట్టగానే అందులో నటించిన నటులకు వరుసపెట్టి అవకాశాలు వస్తుంటాయి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం.. చేసుకోకపోవడం వేరే విషయం. పాపం సల్మాన్ఖాన్.. తను హీరోగా నటించిన తొలి చిత్రం ‘మైనే ప్యార్ కియా’ బ్లాక్బాస్టర్ హిట్ కొట్టినా.. కొన్ని నెలలపాటు అతనికి ఎలాంటి అవకాశాలు రాలేదట. హిట్ ఘనతను తనకు జోడీగా నటించిన భాగ్యశ్రీ ఎగరేసుకుపోయిందని ఓ సందర్భంలో సల్మాన్ తన తొలి చిత్రం తర్వాత ఎదురైన పరిస్థితులను వివరించాడు.
‘‘మైనే ప్యార్ కియా’ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. కానీ, ఆ ఘనతను భాగ్యశ్రీ కొట్టేసింది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ సినిమా హిట్ కావడానికి భాగ్యశ్రీనే కారణమని, నేను ఏదో ఉన్నాను అంటే ఉన్నాననుకున్నారు. దీంతో నాలుగైదు నెలల వరకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. పైగా భాగ్యశ్రీ పెళ్లి చేసుకొని నటనకు దూరం కావాలని నిర్ణయించుకోవడంతో ఇక నాకు అవకాశాలే రావని బాధపడ్డాను’’అని చెప్పుకొచ్చాడు. అయితే, సల్మాన్ అలా బాధపడటం చూడలేక అతడి తండ్రి సలీం ఖాన్.. జీపీ సిప్పీ అనే నిర్మాతను పిలిచి.. సల్మాన్తో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించమని చెప్పాడట. ఆ ప్రకటన పత్రికలు, మ్యాగజైన్లలో రావడంతో ఇతర దర్శకులు, నిర్మాతల నుంచి సల్మాన్కు ఆఫర్లు వచ్చాయి. ‘మైనే ప్యార్ కియా’ చిత్రానికి సల్మాన్ పారితోషికంగా రూ.31వేలు తీసుకోగా.. తర్వాత అతడి పారితోషికం రూ.75వేలకు పెరిగిందట.
సల్మాన్ఖాన్తోపాటు హీరోయిన్ భాగ్యశ్రీ, దర్శకుడు సూరజ్ బర్జాత్యాకు కూడా ఇదే తొలి సినిమా. సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి.. పేదింటికి చెందిన అమ్మాయి ప్రేమలో పడతారు. ఆ తర్వాత వారికి ఎదురయ్యే పరిస్థితులే కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం 1989 డిసెంబర్29న విడుదలైంది. కథ, పాటలు ప్రేక్షకులకు అమితంగా నచ్చడంతో బ్లాక్బాస్టర్ హిట్ సాధించింది. అప్పటి బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా ‘మైనే ప్యార్ కియా’ రికార్డు సృష్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు