Raja ravindra: సినిమాల్లో వేషాలు దొరక్కపోతే.. ఆర్టిస్టులకు టీ, కాఫీలు ఇచ్చి బతుకుతా!
నాకు సినిమా అంటే పిచ్చి, సినిమాల్లో వేషాలు దొరక్కపోతే.. ఆర్టిస్టులకు టీ, కాఫీలు ఇచ్చి బతుకుతా’ అన్నారు నటుడు రాజారవీంద్ర. శ్రీముఖి ప్రధానపాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో రాజారవీంద్ర కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజారవీంద్ర విలేకరులతో ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
ఇంటర్నెట్ డెస్క్: ‘నాకు సినిమా అంటే పిచ్చి, సినిమాల్లో వేషాలు దొరక్కపోతే.. ఆర్టిస్టులకు టీ, కాఫీలు ఇచ్చి బతుకుతా’ అన్నారు నటుడు రాజారవీంద్ర. శ్రీముఖి ప్రధానపాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో రాజారవీంద్ర కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజారవీంద్ర విలేకరులతో ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
‘‘నేను గతంలో జయసుధగారితో ‘ఆంటీ’ అనే సినిమా చేశా. జనరేషన్ గ్యాప్ రావడంతో ఇప్పుడు అంకుల్స్ అయ్యాం(నవ్వుతూ). మంచి ఎంటర్టైన్మెంట్ జోనర్ ఇది. కరోనా వల్ల ఎంటర్టైన్మెంట్ జోనర్లో కొంతకాలంగా మంచి సినిమాలు రావడం లేదు. ఇది చాలా మంచి సినిమా అవుతుంది. థియేటర్కు వచ్చిన వారంతా కరోనాను మరిచిపోయి హాయిగా నవ్వుకుంటారు’’
‘‘ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే. 50ఏళ్ల వయసున్న వ్యక్తికి పెళ్లయి.. పిల్లలు పుట్టి.. వాళ్లకు కూడా పిల్లలు పుట్టి.. సమయం అంతా మనవలు, మనవరాళ్లతో ఆడుకునేందుకే సరిపోతుంది. ఆ తర్వాత భార్య, భర్త మధ్య కాస్త గ్యాప్ వస్తుంది. ఆ సమయంలో చిన్న ఆనందం కోసం ఫేస్బుక్, వాట్సాప్ ఛాటింగ్తో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్ని తప్పులు చేశాడన్నదే నా పాత్ర’’
‘‘రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నేను కనిపించనున్నాను. మనోగారిది బంగారం దుకాణం, భరణిగారు వడ్డీ వ్యాపారం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. భవిష్యత్తులో మనం ఎలా ఉండాలనే కోణంలో యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది’’
‘‘ఈ సినిమాలో కొత్తకోణం ఏంటంటే.. ముగ్గురు మధ్య వయసున్న వ్యక్తులు కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేయడం సరదాగా ఉంటుంది. ముగ్గురూ స్నేహితులు కావడం.. ఒకరికి తెలియకుండా.. ఒకరు అమ్మాయిని పడేయాలని చూడటం బాగా కట్టుకుంటాయి’’
‘‘సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం ఉండవు. కుటుంబంతో సహా చూడగలిగే సినిమా ఇది. యాంకర్గా శ్రీముఖి అందరికీ తెలిసిన వ్యక్తే. చాలా యాక్టీవ్గా ఉంటుంది. మనోగారితో పాటు కొన్ని షోలు కూడా చేసింది. మాకు కూడా కొత్తేం కాదు. అందరం కలిసి సరదాగా ఆడుతూపాడుతూ ఈ సినిమా చేశాం’’
‘‘నేను చేసిన సినిమాల్లో విలన్ పాత్రలే ఎక్కువ. అయితే.. నేను బయట కూడా చాలా సరదాగా ఉంటాను. నా అప్పీరెన్స్ ఎలాగూ విలన్లాగే ఉంటుంది కాబట్టి.. సీరియస్ పాత్రలు చేయాలంటే కేవలం డైలాగ్స్ చెబితే సరిపోతుంది. కానీ కామెడీ విషయంలో అలా ఉండదు. మంచి టైమింగ్ ఉండాలి. నిజానికి కామెడీ పాత్రలు చేయడం చాలా కష్టం. గతంలో ఆంటీ సినిమాలో కామెడీ పాత్ర చేశాను. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో చేశాను’’
‘‘కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎవరికి వైరస్ వచ్చినా అందరికీ ఇబ్బందే. సినిమా షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి. అందుకే వేగంగా పూర్తి చేశాం. మొదటి ఈ సినిమాను ఓటీటీకి ఇద్దాం అనుకున్నాం. సినిమా థియేటర్కు వెళితేనే బాగుంటుంది అనిపించింది. అందుకే థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమాలో పోసానిగారి పాత్ర కూడా చాలా నవ్విస్తుంది’’
‘‘నాకు సినిమా అంటే పిచ్చి. ఒకవేళ సినిమా అవకాశాలు లేకపోతే.. ఆర్టిస్టులకు, టెక్నిషియన్లకు కాఫీ, టీ ఇచ్చుకుంటూ ఇక్కడే బతుకుతానని ఎన్నోసార్లు చెప్పాను. నా దగ్గరికి వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని నేను వదులుకోను. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలు చేయాలని ఏం పెట్టుకోను’’
‘‘నా విషయానికొస్తే నా కెరీర్లోనే ఎక్కువ సినిమాలు చేసింది కరోనా సమయంలోనే. నాకు తెలిసి హైదరాబాద్లో 100నుంచి 120 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఓటీటీ రావడం వల్ల అవకాశాలు ఇంకా పెరిగాయి. రెమ్యునరేషన్ కూడా ఎవరికి తగ్గలేదు. పెరిగిందనే చెప్పాలి. నేను మొదటి నుంచి జీవితాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆ ప్రభావం నా కెరీర్ మీద పడిందనుకుంటా(నవ్వుతూ). ఇప్పుడు సీరియస్గా తీసుకున్నా సమయం లేదు.
‘‘ఈవీవీ సత్యనారాయణగారు గొప్ప డైరెక్టర్. ఎందుకంటే.. ఆయన పెద్ద స్టార్లతో సినిమాలు చేసి.. ఆ తర్వాత చిన్నచిన్న సినిమాలు కూడా చేసేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. చిన్న సినిమాలకు పెద్ద డైరెక్టర్లు రావడం లేదు. చిన్ని సినిమాలను తీసిన పెద్ద డైరెక్టర్ అంటే ఈవీవీ ఒక్కరే’’
‘‘ఓటీటీలో సినిమా హిట్టా, ఫట్టా అనే విషయాన్ని అంచనా వేయలేం. సినిమా ఫలితాన్ని నిర్ణయించేది థియేటర్ మాత్రమే. థియేటర్లను బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కోసం ఓటీటీకి సినిమాలు ఇస్తూ వెళ్తే ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సినిమా మీద ఆధారపడి ఎంతోమంది ఉన్నారు’’ అని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!