MAA Elections: అవును వాళ్లకు విమానం టికెట్లు బుక్ చేశాం.. అందులో తప్పేమీ లేదు!
సినీ నటుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని, ప్రస్తుతం సమయం లేనందున వీడియో రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్త
హైదరాబాద్: సినీ నటుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానని, ప్రస్తుతం సమయం లేనందున వీడియో రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తానని మా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి మంచు విష్ణు అన్నారు. శనివారం సాయంత్రం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘శుక్రవారం నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్ పార్టీకి 250 నుంచి 300మంది వస్తారనుకున్నాం. కానీ, 560మంది వచ్చారు. అందరూ ‘మా’ సభ్యులే. వారంతా నాతోనే ఉన్నారు. నా కుటుంబ సభ్యులను పిలిచి నాకెందుకు ఓటు వేయాలో చెప్పాను. వాళ్లకు నచ్చితే వేస్తారు. వాళ్లంతా పాజిటివ్గా స్పందించారు. ‘మా’ చరిత్రలో ఇప్పటివరకూ జరగని రీతిలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ‘మా’ సభ్యులు విమానంలో వచ్చి మరీ ఓటు వేసి వెళ్తారు. వాళ్లంతా చూపిస్తున్న ప్రేమ, భరోసా ఎన్ని జన్మలైనా రుణం తీర్చుకోలేను’’ అని మంచు విష్ణు చెప్పారు.
విష్ణు చక్రాన్ని పాకెట్లో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్లకు తెలుస్తుంది
ఇక విష్ణు ప్యానెల్కు మద్దతు ఇస్తున్న ‘మా’ మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు నరేశ్ కూడా విలేకరులతో మాట్లాడారు. ‘‘రెండు రోజుల నుంచి ఎన్నికల ఏర్పాట్లు చూస్తున్నాం. ఇరు ప్యానెల్ వర్గాలు వచ్చాయి. ఎన్నికలు అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నం 2గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. నాలుగైదు గంటల పాటు ఓట్లను లెక్కిస్తారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టాలని మొదట అనుకున్నాం. కానీ, వర్షాల కారణంగా అందరి ఆమోదంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ఎవరి ప్రచారాన్ని వాళ్లు పూర్తి చేసుకున్నారు. ఈరోజంతా ఏర్పాట్లలోనే ఉన్నాం. శుక్రవారం మోహన్బాబుగారు ఇచ్చిన మేనిఫెస్టో డిన్నర్కు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారు. విష్ణు ప్యానెల్కు ఏ స్థాయిలో మద్దతు ఉందో దీనిని బట్టే తెలుసుకోవచ్చు. మేం గెలవడం కాదు.. ఓటర్లు గెలవాలి’’
‘‘నేను చక్రం తిప్పడం పక్కన పెడితే, విష్ణు చక్రాన్ని పాకెట్లో పెట్టుకుంటే ప్యాంట్ ఏమవుతుందో వాళ్లు ఆలోచించాలి. క్యాంపు రాజకీయాలు ఏమీ జరగడం లేదు. భోజనాలకు ఇబ్బంది లేకుండా ఆఫీస్లాంటిది ఏర్పాటు చేశాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేశాం. అందులో తప్పేమీ లేదు. ఓటర్లకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా! అదేమీ పెద్ద సమస్య కాదు. ఇక విష్ణు ప్యానెల్ ప్రకటించిన మేనిఫెస్టో చరిత్రలో ఎవరూ ప్రకటించలేదు. దాన్ని చూసిన తర్వాత విష్ణు ప్యానెల్పై నటీనటులకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ప్రకాశ్రాజ్కు ఇంగిత జ్ఞానం, విషయ జ్ఞానం, సినిమా జ్ఞానం ఉన్న వ్యక్తి అని అంటున్నారు కానీ, క్యారెక్టర్ కూడా ఉండాలి కదా. అది ఉంటే ఆయన గెలుస్తారు’’ అని ఎద్దేవా నరేశ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్