Nithiin: మ్యాస్ట్రో ఫైనల్‌ షెడ్యూల్‌ ఆరంభం

బాలీవుడ్‌లో హిట్‌ అందుకున్న ‘అందాధున్‌’ను ఆధారంగా చేసుకుని తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రం ‘మ్యాస్ట్రో’. నితిన్‌ కథానాయకుడిగా...

Updated : 14 Jun 2021 13:55 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌లో హిట్‌ అందుకున్న ‘అందాధున్‌’ను ఆధారంగా తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రం ‘మ్యాస్ట్రో’. నితిన్‌ కథానాయకుడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌ సరసన నభానటేశ్‌ నటిస్తుండగా.. తమన్నా కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా నితిన్‌-తమన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరా సాగర్‌ స్వరాలు అందిస్తున్నారు. నితిన్‌ పుట్టినరోజు కానుకగా ఇటీవల విడుదలైన ఈసినిమా ఫస్ట్‌గ్లిమ్స్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని