Jai bhim: గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చేసేవి: లిజోమోల్ జోస్
ప్రతి చిత్ర పరిశ్రమలోకి ఏటా కొత్త హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, నటీమణులు మాత్రమే చిరకాలం
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి చిత్ర పరిశ్రమలోకి ఏటా కొత్త హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, కొందరు మాత్రమే చిరకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. అలాంటి వారు చాలా అరుదుగా వెండితెరపై మెరుస్తారు. ఆ కోవకు చెందినదే లిజోమోల్ జోస్. సూర్య కీలక పాత్రలో తెరకెక్కిన ‘జై భీమ్’లో చిన్నతల్లి పాత్రలో ఆమె నటించలేదు.. జీవించింది. ఆ పాత్రను ఆకళింపు చేసుకుంది. కాదు.. కాదు.. ఆవాహన చేసుకుంది. షూటింగ్ జరిగినన్ని రోజులు తాను లిజో అన్న సంగతి మర్చిపోయింది. చిన్నతల్లిగా గర్భవతి పాత్రలో ఒదిగిపోయింది. ఆ కష్టమే ఇప్పుడు ఆమెకు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. త.శె.జ్ఞానవేల్ తెరకెక్కించిన ‘జై భీమ్’లో సూర్య ఉన్నా, కథలో చిన్నతల్లి, ఆమె భర్త రాజన్న పాత్రలే కీలకం. ఆ రెండూ సినిమాకు రెండు కళ్లలాంటివి. వారి దృష్టి కోణం నుంచే ప్రేక్షకుడు ‘జై భీమ్’ను చూశాడంటే అతిశయోక్తి కాదు. ఇన్ని ప్రశంసలు దక్కించుకుంటున్న లిజోమోల్ జోస్ ఎవరు? ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..
* లిజోమోల్ కేరళలో జన్మించింది. తల్లిదండ్రులు ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. ఆమెకు ఒక సోదరి.
* అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదివింది. పాండిచ్చేరి యూనివర్సిటీలో ‘ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్’లో మాస్టర్స్ చేసింది. డిగ్రీ తర్వాత కొన్నాళ్లు ఓ టెలివిజన్ ఛానల్లో లిజో పనిచేసింది.
* ఫహద్ ఫాజిల్ నటించిన ‘మహేశింటే ప్రతికారం’ చిత్రంలో లిజోకు తొలి అవకాశం లభించింది. తన స్నేహితురాలి వాట్సాప్ గ్రూపులో ఈ సినిమా ఆడిషన్స్ గురించి ప్రకటన రావడంతో ఆమె లిజోకు చెప్పింది. అలా ఆడిషన్స్కు తన ఫొటోలు పంపింది.
* లిజో ఇటీవల అరుణ్ ఆంటోనిని వివాహం చేసుకుంది.
* రెండు వారాల తర్వాత చిత్ర బృందం నుంచి ఫోన్కాల్ వచ్చింది. తనకు నటన, పాడటం ఏదీ రాదని లిజో చెప్పడంతో ‘ఇటీవల మీరు చూసిన సినిమా గురించి మీ స్నేహితురాలికి ఎలా చెబుతారు’ అనేది చేసి చూపించమనడం, లిజో చేయటం, అది వారికి నచ్చడంతో సినిమా కోసం తీసుకున్నారు.
* షూటింగ్ అంటే భయపడుతున్న ఆమెకు దర్శకుడు దిలీశ్ పోతన్ ఎక్కువ ఆలోచించే సమయం ఇచ్చే వారు కాదట. దీంతో అప్పటికప్పుడు సన్నివేశాలు చేయడంతో అవన్నీ సహజంగా వచ్చాయట.
* 2016లో వచ్చిన మలయాళ చిత్రం ‘రిత్విక్ రోషన్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ 2.5’ ఆమెను మరో మెట్టు ఎక్కించింది.
* ఆ తర్వాత ‘స్ట్రీట్లైట్స్’, ‘ప్రేమసూత్రం’, ‘వత్తకోరు కాన్ముకన్’ తదితర మలయాళ చిత్రాల్లో నటించింది.
* ఇక తమిళంలో ‘శివప్పు మంజల్ పచ్చాయ్(తెలుగులో ఒరేయ్ బామ్మర్ది) సిద్ధార్థ్కు జోడీగా చక్కని నటన కనబరిచింది. అయితే, ఈ సినిమా ఆడిషన్స్ సందర్భంగా తమిళం రాక లిజో ఇబ్బంది పడింది. మూడు దశల్లో జరిగిన ఆడిషన్స్ను దాటుకుని చివరకు కథానాయికగా ఎంపికైంది.
* ‘శివప్పు’లో లిజో నటనను చూసిన త.శె.జ్ఞానవేల్ ‘జై భీమ్’లో చిన్నతల్లి పాత్ర కోసం అడిగారు. ఈ సినిమా/పాత్ర కోసం లీజో తనని తాను మార్చుకుంది.
* సినిమా చూసిన తర్వాత ‘ఒరేయ్ బామ్మర్ది’లో నటించిన లిజోనేనా ‘జై భీమ్’లో చేసింది?అన్న ఆశ్చర్యం ప్రేక్షకుడిలో కలిగింది.
* ‘జై భీమ్’లో చిన్నతల్లి పాత్ర గురించి లీజో మాట్లాడుతూ.. ‘‘ఆ పాత్ర నుంచి పూర్తిగా బయటకు రాలేకపోయా. చిన్నతల్లి అనుభవించిన బాధ, ఆవేదన ఇప్పటికీ నాలో ఉండిపోయాయి. గతంలో నేను పోషించిన ఏ పాత్ర కూడా నన్ను ఇంతలా ప్రభావితం చేయలేదు’’ అని చెప్పింది.
* ‘‘కొన్ని సన్నివేశాల్లో నటించినప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను గ్లిజరిన్ వాడకుండానే ఏడ్చేశాను. డైరెక్టర్ కట్ చెప్పినా.. నా కన్నీళ్లు ఆగలేదు. తిరిగి సాధారణ స్థితికి రావడానికి నాకు చాలా సమయం పట్టేది. ఎన్నిసార్లు ఈ చిత్రం చూసినా నాకు ఏడుపు వచ్చేస్తోంది’’ అని లీజో భావోద్వేగంతో చెప్పుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్