Vijay Deverakonda: ఆ విషయంలో నాకు ఏడుపొస్తుంది: విజయ్ దేవరకొండ
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సంచలన హీరోగా మారిన విజయ్ దేవరకొండ త్వరలోనే ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానున్న నేపథ్యంలో ప్రచారాన్ని ఫుల్జోష్తో చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ప్రెస్మీట్లలో పాల్గొన్న ఆయన సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన మీట్కి హాజరయ్యారు.
హైదరాబాద్: ‘అర్జున్రెడ్డి’ చిత్రంతో సంచలన హీరోగా మారిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) త్వరలోనే ‘లైగర్’గా (Liger) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానున్న నేపథ్యంలో ప్రచారాన్ని ఫుల్జోష్తో చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ప్రెస్మీట్లలో పాల్గొన్న ఆయన సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన మీట్కి హాజరయ్యారు. విజయ్తోపాటు కథానాయిక అనన్య పాండే పాల్గొన్నారు. మరి, ఏ విషయంలో విజయ్కి ఏడుపొస్తుంది? ఆయన మాటల్లోనే..
పక్కా తెలుగు సినిమా
‘‘ముందుగా ఈ సినిమాని తెలుగులోనే తెరకెక్కించాలనుకున్నాం. ఇప్పటికే మన తెలుగు సినిమాలు కొన్ని పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాయి. ‘మన కంటెంటూ అన్ని భాషల వారినీ ఆకట్టుకుంటుంది. ఆ రేంజ్లో మనమెందుకు చేయకూడదు’ అని అనిపించింది. అలా ప్రాంతీయ సినిమాగా రూపొందించాలనుకున్నది కాస్తా జాతీయ స్థాయిలో తెరకెక్కింది. ‘‘లైగర్’ హిందీ సినిమాలా అనిపిస్తోంది’ అనే భావన చాలామందిలో ఉంది. ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకులంతా బాలీవుడ్ వారు. అందుకే పాటలన్నీ హిందీలో ఉన్నట్టు అనిపిస్తుంది. చిత్రీకరణ సమయానికి హిందీ వెర్షన్ పాటలు మాత్రమే పూర్తయ్యాయి. టాకీ పార్ట్ని తెలుగు, హిందీ వెర్షన్లలో షూట్ చేశాం. కథ పరంగా ఇది పక్కా తెలుగు సినిమా’’
కరణ్తో పరిచయం..
‘‘నా ‘అర్జున్రెడ్డి’ సినిమా తనకి బాగా నచ్చటంతో కరణ్ జోహార్ నాకు కాల్ చేసి, మాట్లాడారు. నాతో సినిమా చేసే ఉద్దేశం ఉందని చెప్పారు. తన దగ్గరకు వచ్చే కొన్ని కథలను నాకు పంపిస్తానన్నారు. ఓ రోజు.. ‘‘పూరీ జగన్నాథ్ నాతో చేయబోయే సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుంది’’ అని లైగర్ గురించి ఆయనకు వివరించా. కథ వినకుండానే సినిమాను నిర్మించేందుకు కరణ్ ఓకే అన్నారు’’
ఆ సినిమాతో సంబంధం ఉండదు
‘‘చాలామంది ‘లైగర్’ను ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, రెండింటికీ ఏం సంబంధం ఉండదు. నేను రీమేక్లు, గత చిత్రాలకు దగ్గరకు ఉండే కథల్ని ఎంపిక చేసుకునే వాణ్ణి కాదు. ‘లైగర్’.. తల్లీకొడుకుల ఎమోషన్ ప్రధానంగా సాగుతుంది. ఇందులోని హీరో పాత్రకి నత్తి ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ నటించా. నత్తి బాగా అలవాటు కావటంతో ఇప్పుడు మామూలుగా మాట్లాడాలంటే నచ్చట్లేదు’’
ట్రోలింగ్ తప్పదు!
‘‘నటుణ్ణికాక ముందు మా బంధువులు నన్ను విమర్శించేవారు. ‘ఏ ర్యాంక్ నీది? మా వాళ్లు ఆ కాలేజీ.. ఈ కాలేజీ. జీవితంలో నువ్వు ఏం చేస్తావ్రా?’ అని ట్రోల్ చేసేవారు. యాక్టర్ని అయ్యాక కొందరు సోషల్ మీడియా ద్వారా నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడైనా విమర్శలు అనేవి తప్పవు. నా తొలి సినిమా నుంచీ నేను ఒకేలా ఉన్నా. నేను నటించిన సినిమాల గురించి నాకు అనిపించింది చెప్తుంటా. అలా చేయటం వల్ల మీడియా వారు కూడా నన్ను వదల్లేదు. ‘వీడికి బలుపు. సినిమా విడుదలవకుండానే హిట్ అని చెప్తాడు. వీడు చాలా నేర్చుకోవాలి’ అని కొందరు అన్నారు’’
అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా
‘‘కెరీర్ తొలినాళ్లలో నటుడిగా అవకాశాలు లభించకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ పరిచయాలు పెంచుకుని, ఆ తర్వాత యాక్టర్ని కావాలనుకున్నా. ఆ క్రమంలో దర్శకుడు తేజ దగ్గర కొంతకాలం పనిచేశా. ‘అసిస్టెంట్ డైరెక్టర్లకు పూరీ జగన్నాథ్ ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అతని దగ్గర పనిచేసేందుకు ప్రయత్నించు’ అని మా నాన్న అన్నారు. ఆయన మాట మేరకు పూరీ ఆఫీస్కు వెళ్లా. అక్కడంతా బిజీగా ఉంది. నేను ఎవరో అప్పటికి ఎవరికీ తెలియదు కాబట్టి వెళ్లిన పని కాలేదు. ఇంటికి వచ్చాక ‘పూరీని కలిశా’ అని నాన్నకు అబద్ధం చెప్పా. నేను హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సమయంలో పూరీ జగన్నాథ్ని కలిశా. ఆయన చెప్పిన ‘లైగర్’ కథ వినగానే బాగా నచ్చేసింది. దాంతో ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాం’’
సవాలు విసిరింది
‘‘మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. శారీరకంగా, మానసికంగా నాకు సవాలు విసిరింది. ఫిజికల్ ట్రాన్సఫర్మేషన్ కోసం సుమారు 18 నెలలు కష్టపడ్డా. అది ఏమోగానీ డ్యాన్స్ చేయాలంటే మాత్రం నాకు ఏడుపొస్తుంది. నానా కష్టాలుపడి చిత్రీకరణ పూర్తి చేస్తుంటా. ప్రేక్షకులు థియేటర్లకు వస్తే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం ఉండదు. కానీ, వారిని థియేటర్లకు రప్పించటం కష్టం. ఇప్పుడు అదే మన పని. ప్రేక్షకులు ఒక్కసారి థియేటర్లో అడుగుపెట్టారంటే కథలో వెంటనే లీనమవుతారు. నాకు తేదీల సెంటిమెంట్ లేదు. చిత్రీకరణ పూర్తయిన సినిమాని ఎంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే అంత మంచిది అని భావిస్తా’’
టైసన్ని చూసి భయపడ్డా
‘‘మైక్ టైసన్తో ఫైట్ అని చెప్తే అమ్మ చాలా భయపడింది. ఆయన్ను కలవగానే నేనూ టెన్షన్ పడ్డా. తర్వాత ఆ భయం పోయింది. టైసన్ పైకి ఎంత భయంకరంగా కనిపిస్తారో వ్యక్తిత్వంలో అంత మంచి మనిషి. కొన్నేళ్ల క్రితం వరకు నేనెవరో మీకు తెలియదు. మీకు నాకూ మధ్య సినిమానే వారధి. నా మునుపటి సినిమా విడుదలై రెండేళ్లవుతోంది. పైగా గత రెండు చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. నేను కూడా ఎవరికీ అందుబాటులో లేను. అయినా ‘లైగర్’ ట్రైలర్ విడుదలకు చాలామంది వచ్చారు. అంతమందిని చూసి షాక్ అయ్యా. వారిని అలరించేందుకు మరిన్ని మంచి కథలను ఎంపిక చేసుకునే బాధ్యత పెరిగింది’’ అని విజయ్ దేవరకొండ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల