Puneeth Rajkumar: పునీత్కు ఏమైందో చెప్పడం అసాధ్యం: వైద్యులు
పునీత్కు గుండెపోటు రావడానికి గల కారణాలు చెప్పడం అసాధ్యమని రాజ్కుమార్ ఫ్యామిలీ వైద్యుడు రమణరావు పేర్కొన్నారు......
బెంగళూరు: కన్నడ ‘పవర్స్టార్’ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం ఎంతో మందికి తీరని శోకం మిగిల్చింది. ఆయన మరణంతో అభిమానులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే పునీత్ ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేవారని.. ఆయనకు గుండెపోటు రావడానికి గల కారణాలు చెప్పడం అసాధ్యమని రాజ్కుమార్ ఫ్యామిలీ వైద్యుడు రమణరావు పేర్కొన్నారు. శుక్రవారం పునీత్ తన వద్దకు ఎలా వచ్చారో.. అక్కడ ఏం జరిగిందో ఆ వైద్యుడు వెల్లడించారు.
ఓ మీడియా సంస్థతో రమణరావు మాట్లాడుతూ.. ‘నలతగా ఉందంటూ భార్య అశ్వినితో కలిసి పునీత్ నన్ను సంప్రదించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన నుంచి ఇలాంటి మాటలు నేనెప్పుడూ వినలేదు. పలు పరీక్షలు చేశాను. ఆయన బీపీ సాధారణంగానే ఉంది. గుండె స్థిరంగా కొట్టుకుంది. ఊపిరితిత్తుల్లోనూ ఎలాంటి సమస్యా లేదు. కానీ, చెమటలు కారిపోతున్నాయి. అయితే వ్యాయామం తర్వాత ఇది సాధారణమేనని ఆయన చెప్పారు. ఎందుకైనా మంచిదని ఈసీజీ పరీక్ష చేశా. అందులో ఓ స్ట్రెయిన్ను గుర్తించాను. వెంటనే స్థానిక విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అశ్వినికి సూచించాను. వారు కారు ఎక్కగానే విక్రమ్ ఆసుపత్రికి కాల్ చేసి ఐసీయూ సిద్ధం చేయాలని సూచించాను. ఐదారు నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ ఆయనను బతికించుకోలేకపోయాం’ అంటూ రమణరావు పేర్కొన్నారు.
పునీత్ గురించి ఆ వైద్యుడు మరిన్ని విషయాలు వెల్లడించారు. ‘ఆరోగ్యం పట్ల అప్పూ ఎంతో శ్రద్ధ వహించేవారు. పునీత్ను చూసి నేర్చుకోవాలని ఎంతో మందికి సలహాలు ఇచ్చేవాడిని. ఇదో హఠాత్పరిణామం. ఇది గుండెపోటు కాదు (గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం). కార్డియాక్ అరెస్ట్ (గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడం). ఈ కార్డియాక్ అరెస్ట్కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. కానీ అప్పు విషయంలో ఇవేవీ కనిపించలేదు. ఆయనకు మధుమేహం, అసాధారణ రక్తపోటు లాంటివి ఏమీలేవు. అప్పూ విషయంలో ఏం జరిగిందో కచ్చితంగా చెప్పడం అసాధ్యం’ అంటూ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె