కరోనాపై పోరుకు సుకుమార్‌ విరాళం

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కరోనా వైరస్‌పై పోరుకు తనవంతు విరాళం అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా నియంత్రణకు సాయంగా విరాళాలు అందించిన సంగతి.....

Published : 19 Apr 2020 21:22 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కరోనా వైరస్‌పై పోరుకు తనవంతు విరాళం అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా నియంత్రణకు సాయంగా విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకులు, కళాకారులు ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్గిస్తూ.. పాటల్ని, లఘు చిత్రాల్ని రూపొందించారు.

సినీ కార్మికుల కోసం..

అగ్ర కథానాయిక తమన్నా తెలుగు సినీ కార్మికుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’కి (సీసీసీ) రూ.3 లక్షలు విరాళం అందించారు. ఇప్పటికే నటీమణులు కాజల్‌ రూ.2 లక్షలు, లావణ్య త్రిపాఠి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. అనేక మంది నటీనటులతోపాటు దర్శక, నిర్మాతలు కూడా కార్మికుల కష్టాలు తీర్చేందుకు తమ వంతు విరాళం అందించారు. మెగాస్టార్‌ చిరంజీవి చొరవతో కొందరు సినీ ప్రముఖులు కలిసి ఈ సీసీసీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని