ప్రాజెక్ట్ కె... రామోజీ ఫిల్మ్సిటీలో దీపిక
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో ఇప్పటికే ఒక షెడ్యూల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాల్ని పూర్తి చేసిన ప్రభాస్...
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో ఇప్పటికే ఒక షెడ్యూల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాల్ని పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’పై దృష్టి సారించారు. ఆదివారం నుంచి రామోజీ ఫిల్మ్సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హైదరాబాద్కి చేరుకుంది. చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ సంస్థ దీపికాకి ఘనంగా ఆహ్వానం పలికింది. సైన్స్తో ముడిపడిన ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇదివరకు ఆయనపైనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!