Selvaraghavan: ధనుష్తో దర్శకులకి చాలా సౌకర్యం
సినిమా తీతలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్న దర్శకుడు... సెల్వ రాఘవన్. సహజత్వానికి పెద్ద పీట వేస్తూ, చూసే ప్రేక్షకుడికి ‘మన కథే’ అనిపించేలా సినిమాలు తీస్తుంటారాయన. ఆయన సినిమాలు తమిళంతోపాటు, తెలుగులోనూ
సినిమా తీతలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్న దర్శకుడు... సెల్వ రాఘవన్ (Selvaraghavan). సహజత్వానికి పెద్ద పీట వేస్తూ, చూసే ప్రేక్షకుడికి ‘మన కథే’ అనిపించేలా సినిమాలు తీస్తుంటారాయన. ఆయన సినిమాలు తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదలవుతుంటాయి. తన తమ్ముడు ధనుష్ (Dhanush) కథానాయకుడిగా... సుదీర్ఘ విరామం తర్వాత ఓ సినిమా చేశారు. అది ‘నేనే వస్తున్నా’ (Nene Vasthunna) పేరుతో తెలుగులో ఈ నెల 29న గీతా ఆర్ట్స్ సమర్పణలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెల్వ రాఘవన్ శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘ధనుష్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలనేది మా అమ్మ కోరిక కూడా. ధనుష్ పెద్ద స్టార్ అయిపోయాడు. తన డేట్స్ దొరకడం అంత సులభం కాదు ఇప్పుడు. అదే సమయంలో మా ఇద్దరికీ తగ్గ కథ కూడా కుదరాలి. దాదాపు పదేళ్ల తర్వాత మేం కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. మొదట ‘పుదు పెట్టై2’ చేయాలనుకున్నాం. తర్వాత వేరే ఆలోచన వచింది. నాతో కలిసి ఓ సినిమా రాయాలని ధనుష్కి ఎప్పట్నుంచో కోరిక. తొలిసారి ఈ సినిమాని ఇద్దరం కలిసి రాశాం. మా ఇద్దరి ఆలోచనలు దాదాపుగా ఒకేలా ఉంటాయి’’.
* ‘‘నా ఆలోచన నుంచి పుట్టిన కథే.. ‘నేనే వస్తున్నా’. కథ, కథనాల కంటే కూడా... ధనుష్ ద్విపాత్రాభినయం విషయంలో ఎక్కువ సవాళ్లు ఎదురయ్యాయి. రెండు విభిన్నమైన పాత్రలు, ఒకేసారి తెరపై కనిపిస్తుంటాయి. ఆ పాత్రల్ని ఇద్దరు వేర్వేరు నటులు చేసినట్టే ఉండాలి. ఒకపాత్ర నుంచి మరో పాత్రకి మారిపోయి నటించడం ఓ పెద్ద సవాల్. అయితే ధనుష్తో పని చేయడం దర్శకులకి చాలా సౌకర్యం. తనకి పెద్దగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ప్రతీ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని నటిస్తుంటాడు. తను నాకు తమ్ముడే అయినా మేం సెట్కి వెళ్లాక నటుడు, దర్శకుల్లాగే మెలుగుతాం. 20 యేళ్లుగా అలా పనిచేయడమే తెలుసు. తను తమ్ముడైనంత మాత్రాన నాకు సెట్లో అదనంగా ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. మేం ఇద్దరం కొన్ని సన్నివేశాల గురించి వాదించుకుంటాం కూడా. ‘నేనే వస్తున్నా’ గీతా ఆర్ట్స్ నుంచి విడుదలవుతుండడం ఓ గౌరవం. మంచి కథ ఉంటే చెప్పండంటూ ప్రోత్సహిస్తుంటారు నిర్మాత అల్లు అరవింద్’’.
* ‘‘చిత్రసీమలో ఇప్పుడున్న దశ ప్రత్యేకమైనది. సినిమాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. దక్షిణాది సినిమా ఇప్పుడు భారతీయ సినిమా అయ్యింది. రాజమౌళి, సుకుమార్ తదితర దర్శకుల ఆలోచనలతోనే ఇది సాధ్యమైంది. వాళ్లని కథానాయకులు కూడా అదే స్థాయిలో నమ్మారు. ఇది ముమ్మాటికీ వేడుక సమయం. మరిన్ని చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉంది. మనవైన కథలతోనే అందరికీ వినోదం పంచుతున్నాం. ‘యుగానికి ఒక్కడు’ సినిమా అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా నేను తీశా. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఇప్పుడు మరింత బాగా తీస్తాననిపిస్తుంది. అలాంటి చిత్రాల్ని తీయడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ‘యుగానికి ఒక్కడు’కి కొనసాగింపు ఆలోచన ఉంది. అన్నీ కుదిరితే చేస్తానేమో. మనకు తెలిసిన గొప్ప సామ్రాజ్యాల్లో చోళ సామ్రాజ్యం ఒకటి. చోళ సామ్రాజ్యం నేపథ్యం ఒక్కటే తప్ప, రానున్న ‘పొన్నియిన్ సెల్వన్’కీ... నా ‘యుగానికి ఒక్కడు’ సినిమాకీ ఎలాంటి సంబంధం ఉండదు’’.
‘‘నటుడిగా 17, 18 యేళ్ల వయసులో తెరకు పరిచయమయ్యాడు ధనుష్. అప్పట్లో తనకి ఏవైనా సలహాలు ఇచ్చేవాణ్ని కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. కాకపోతే తను చేసే సినిమాల గురించి చెబుతుంటాడు. నేను అనుకోకుండానే నటుడినయ్యా. ‘సాని కాయిదం’లో నేను నటిస్తేనే బాగుంటుందని ఆ చిత్ర దర్శకుడు పట్టుబట్టాడు. దాంతో అదొక కొత్త అనుభవంలా ఉంటుందని నటించా. ‘నేనే వస్తున్నా’లో కూడా ఓ చిన్న పాత్ర చేశాను. దర్శకత్వంపైనే నా దృష్టంతా. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తర్వాత తెలుగు సినిమా చేయలేదని అడుగుతుంటారు. కానీ నా సినిమాల చిత్రీకరణ ఎక్కువగా హైదరాబాద్లోనే జరుగుతుంటాయి. దాంతో తెలుగు సినిమా చేస్తున్నట్టే ఉంటుంది. మంచి కథ కుదిరితే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM