Nayeem Diaries: నిజాలు ఎక్కడా దాచిపెట్టలేదు
నిజ జీవిత కథలకు ప్రస్తుతం చిత్ర సీమలో మంచి డిమాండ్ ఉంది. ‘నయీం డైరీస్’ పేరుతో అలాంటి ఓ సినిమానే మనముందుకు తెస్తున్నారు దర్శకుడు దాము బాలాజీ. గతంలో...
నిజ జీవిత కథలకు ప్రస్తుతం చిత్ర సీమలో మంచి డిమాండ్ ఉంది. ‘నయీం డైరీస్’ పేరుతో అలాంటి ఓ సినిమానే మనముందుకు తెస్తున్నారు దర్శకుడు దాము బాలాజీ. గతంలో రామ్గోపాల్ వర్మ దగ్గర రచయితగా పనిచేసిన ఆయనకిది దర్శకుడిగా తొలిచిత్రం. ఈ సినిమాను వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘స్వతహాగా నేను నక్స్లైట్లలో పనిచేశాను కాబట్టి... ఆ నేపథ్యంలో వచ్చే అడవి సన్నివేశాలు... జైలు జీవితంపై వచ్చే సీన్లు పకడ్బందీగా తీయగలిగాను. వీటితో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అని చెప్పే దాము బాలాజీతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ విశేషాలు...
‘నయీం డైరీస్’ లాంటి కథను ప్రేక్షకుల ముందుకు ఎందుకు తేవాలనుకున్నారు?
‘నయీం’ పీపుల్స్వార్ గ్రూప్ నక్స్లైట్. అతను పోలీసు ఇన్ఫార్మర్. అతను ఓ క్రూరుడు. అతను ఓ ప్రేమికుడు. అతను అక్కను ఎంతగానో గౌరవించే సోదరుడు. ఇలా భిన్నమైన కోణాలున్న వ్యక్తి. అతని గురించి... అతను అలా తయారుకావడానికి కారణాల గురించి చర్చించాలని అనిపించింది. అందుకే ఈ కథ మీద ఎంతో రీసెర్చ్ చేశా. ముందు ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్గోపాల్వర్మ తీయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆయన తీయలేదు. తర్వాత నాకు నిర్మాత వరదరాజు దొరికారు. నేనే మొదలు పెట్టి తీశాను.
నక్స్లైట్గా ఉన్న మీరు దర్శకుడు కావాలని ఎందుకనుకున్నారు?
చిన్నప్పటి నుంచి నాకు కథలు రాయడం ఇష్టం. దర్శకుడు కావాలని కోరిక ఉండేది. డాక్యుమెంటరీలు చేశాను. పదేళ్ల పాటు నక్స్లైట్గా పనిచేశాను. ఆ తర్వాత అధ్యాపకుడిగా ఉన్నా. ఈ సమయంలో నా చిన్నప్పటి కోరిక మళ్లీ మొగ్గ తొడిగింది. దర్శకులు రాఘవేంద్రరావు తీసిన ‘సుభాష్ చంద్రబోస్’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశా. తర్వాత రామ్గోపాల్వర్మ దగ్గర రచయితగా మారా. ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రానికి రీసెర్చి మొత్తం చేశా. నయీం జీవితంపై సినిమా తీస్తున్నట్లు 2016లో ఆర్జీవీ ప్రకటించారు. ఆయన కోసమే నయీంపై పరిశోధన మొదలుపెట్టా. తర్వాత వర్మ ఈ సినిమా చేయట్లేదని చెప్పారు. నేను అప్పటికే మంచి కథ తయారు చేసుకున్నా. దాన్నే ఇప్పుడు ‘నయీం డైరీస్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నా.
ఈ సినిమా ద్వారా ఏం చెప్పనున్నారు?
నయీం అనే గ్యాంగ్స్టర్ తయారు కావడానికి దారి తీసిన పరిస్థితులన్నీ ఇందులో కళ్లకు కట్టే ప్రయత్నం చేశా. నిజాలను ఎక్కడా దాచిపెట్టలేదు. నయీంతో పాటు జైలులో ఉన్న వారితో మాట్లాడాను. అక్కడి పరిస్థితులన్నీ తెలుసుకున్నా. అప్పట్లో ముషీరాబాద్ జైలులో నక్స్లైట్లకు ప్రత్యేక విభాగం ఉండేది. అక్కడ వందమంది వరకూ నక్స్లైట్లు ఉండేవారు. వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవి. ఇక్కడ వీరందరికీ నాయకత్వం వహించడానికి కమ్యూన్ కమిటీ అంతర్గతంగా ఉండేది. ఈ కమిటీలో నయీం సభ్యుడు. తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అతన్ని కమిటీ నుంచి బహిష్కరించారు. అంతేగాక నయీం వాళ్ల అక్క జీవితం నాశనం కావడానికి ఓ మాజీ నక్స్లైట్ కారణం. దీంతో వారిపై నయీం పగ పెంచుకున్నాడు. ఈ సమయంలో పోలీసులు నయీంను మచ్చిక చేసుకొని నక్స్లైట్ల గురించి సమాచారం తెలుసుకున్నారు. ఒక మనిషి సంఘవిద్రోహ శక్తిగా మారడానికి ఆర్థిక, పాలన, రక్షణ, రాజకీయ వ్యవస్థలూ కారణమవుతాయనే కోణంలో కథ చూపించాం. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం చూసి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రియల్ పాత్రలకు సంబంధించిన వ్యక్తుల తాలుకూ మనుషులు సినిమా రిలీజ్ కానివ్వమని బెదిరిస్తున్నారు.
నిజ జీవిత పాత్రలకు తగిన నటులను ఎలా ఎంపిక చేశారు?
నిజ జీవిత పాత్రలకు తగ్గట్లుగా ఆహార్యం ఉండే వారిని ఎంపిక చేసుకోవాలని నేను అనుకోలేదు. పాత్ర తాలుకూ భావోద్వేగాలను పండించే వారు ఉంటే మంచిదని ముందు నుంచి నా ఆలోచన. కన్నడ నటుడు వశిష్ట సింహా నయీం పాత్రకు సరిపోతాడని అనిపించింది. అతను కర్నాటకలో ఉత్తమ నటుడిగా పురస్కారాలు సైతం అందుకున్నాడు. అతని పూర్వికులది కరీంనగర్ జిల్లానే. తర్వాత వారి కుటుంబం మైసూర్ వెళ్లి స్థిరపడ్డారు. ఈ చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నాడు. మా సినిమా చేస్తుండగానే ‘నారప్ప’, ‘కేజీఎఫ్’ వంటి చిత్రాల్లో వశిష్ట సింహాకు అవకాశాలొచ్చాయి. ఇక యజ్ఞశెట్టి, దివి, నిఖిల్, శశికుమార్ వంటి నటులు పాత్రల్లో ఒదిగిపోయారు. అరుణ్ ప్రభాకర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సురేష్ భార్గవ్ కెమెరా పనితనం నా కథను మరోస్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్