MAA Elections: మేమే ఎందుకు టార్గెట్?
‘‘అందరూ జీవిత, రాజశేఖర్లనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అన్నారు నటి జీవిత. ప్రపంచంలో ఎవరూ చేయని పనులు.. తప్పులు తామేం చేశామని అడిగారు. మంచి చేయాలనుకోవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
‘‘అందరూ జీవిత, రాజశేఖర్లనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అన్నారు నటి జీవిత. ప్రపంచంలో ఎవరూ చేయని పనులు.. తప్పులు తామేం చేశామని అడిగారు. మంచి చేయాలనుకోవడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న ఆమె తమపై వస్తున్న విమర్శలపై సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు. గతంలో నరేశ్ గారే తమని ‘మా’ ఎన్నికల్లోకి ఆహ్వానించారని, ఆయన మాటలు వినే ఎన్నికల్లో పోటీ చేశామని అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో నేను ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేస్తానని మోహన్బాబు, నరేశ్, విష్ణులకు ముందే చెప్పా. అయినా ఎవరు ఏ ప్యానల్లో ఉంటారన్నది వాళ్ల వాళ్ల ఇష్టాల్ని బట్టి ఉంటుంది. గతంలో మేము నరేశ్కు మద్దతుగా నిలిచాం. ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టాం. అయితే ఆ ఆరోపణలు ఎన్నికల వరకే పరిమితం చేయాలని రాజశేఖర్.. నరేశ్కు సూచించారు. దానికి ఆయన కూడా సరే అన్నారు. కానీ, తర్వాత ఆ విషయంలోనే మాకు.. నరేశ్కు విభేదాలు తలెత్తాయి. ఇక ‘మా’ డైరీ విడుదల కార్యక్రమం తర్వాత మా మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ‘మా’ కోసం నరేశ్ పనులు చేయలేదని నేను ఎక్కడా చెప్పలేదు. ఆయన అందరినీ కలుపుకొని పోకపోవడం వల్లే ఇన్ని సమస్యలొచ్చాయి. ఏ నిర్ణయం తీసుకుందామన్నా ఎవరినీ పిలిచే వారు కాదు. ‘వాళ్లంతా ఎందుకు? మనం సరిపోతాం కదా’ అనేవారు. తర్వాత ఆయన ఓ ఫారెన్ ప్రొగ్రాం నిర్ణయించారు. ఇదే కార్యక్రమం విషయంలో ఆయన రచ్చ రచ్చ చేశారు. చిరంజీవితో సహా పెద్దలందరూ కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి సంబంధించిన లావాదేవీలను లెక్కించారు. చివరకు ఎలాంటి తప్పు జరగలేదని నిర్ధారించారు. అయినా కూడా అదే అంశంపై నరేశ్ ఎలక్షన్స్లో మాట్లాడారు. ఆ పాయింట్తోనే ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ఎవరైతే ఆ ఫారెన్ ప్రొగాం చేశారో అదే వ్యక్తులతో మళ్లీ కాంట్రాక్ట్ కుదుర్చుకుని, వాళ్ల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. వాళ్లలో ఓ వ్యక్తి అమెరికాలో ప్రోగ్రాం చేసినందుకు రూ,కోటి ఇస్తామన్నారు. ఇదే విషయాన్ని నరేశ్ మాతో చర్చించారు. ‘ఎవరి వల్ల అయితే సమస్య వచ్చిందో వాళ్లతోనే మళ్లీ ప్రోగ్రాం చేస్తామనడం సమంజసం కాద’ని 14 మంది ‘మా’ ప్యానెల్లోని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ మీటింగ్ పెట్టాకే నిర్ణయం తీసుకుందామని నరేశ్కు చెబితే అందుకు ఆయన ఒప్పుకోలేదు. అక్కడే మాకూ ఆయనకు సమస్య వచ్చింది. అప్పటి నుంచి మేం ఏం మాట్లాడినా ఆయన తప్పుగా భావించేవారు. జనరల్ బాడీ మీటింగ్ పెడదామంటే మాకు నోటీసులు పంపారు. సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని డైరీ విడుదల వేడుక సింపుల్గా చేద్దామని మేము సూచించాం. కాదని, దాన్ని ఓ పెద్ద వేడుకలా చేసింది నరేశ్. అప్పుడే రాజశేఖర్ మాట్లాడారు. అది తప్పెలా అవుతుంది. ఇన్ని తప్పులు పెట్టుకుని భాయీ.. భాయీ అంటూ ఎలా కౌగలించుకుంటారు. పెద్ద చిన్నా ఎవరూ రాజశేఖర్కు సపోర్ట్ చేయలేదు. దీంతో రాజశేఖర్ రాజీనామా చేశారు’’ అన్నారు.
ఎన్టీఆర్ బాధపడ్డారు..
‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదన్నారు జీవిత. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఉన్న వాళ్లు ఏమైనా తెలుగు వాళ్లా? అని ప్రశ్నించారు. ‘‘ఇటీవల ఓ వేడుకలో ఎన్టీఆర్ను కలిశా. ‘మీరు నాకు ఓటు వేయాలి’ అని ఆయన్ని అడిగా. ‘నన్ను అడగొద్దమ్మా.. నేను రానమ్మా.. జరుగుతున్నది చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉందమ్మా’ అని అన్నారు. నిజంగా ఆయన చెప్పినట్లు పరిస్థితి అలాగే ఉంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..