‘‘లాక్డౌన్లో ఓ మంచి వార్త విన్నాను’’
భారతదేశ భద్రత దృష్ట్యా టిక్టాక్సహా చైనాకు చెందిన 59 యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వడంతోపాటు ఆర్థికంగా చైనాను
చైనా యాప్స్ నిషేధంపై సినీ ప్రముఖుల స్పందన
భారతదేశ భద్రత దృష్ట్యా టిక్టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా చైనాను దెబ్బతీస్తేనే ఆ దేశం పొగరు అణుగుతుందని చెప్పారు.
‘‘చైనా యాప్స్ను ప్రభుత్వం నిషేధించగానే చాలా మంది సంబరాలు చేసుకోని ఉంటారు. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలోకి చైనా ఎంతలా చొచ్చుకొచ్చిందో అందరికీ తెలుసు. మన వర్తక వ్యాపారాలు చాలా వరకు ఆ దేశంపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ, ఈ ఏడాది చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇలాంటి సంక్షోభ సమయంలో వాళ్లు మన సరిహద్దుల్లో గొడవలకు దిగుతున్నారు. వాళ్లకి కేవలం లద్దాఖ్ ఒకటే కాదు.. అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, అస్సాం ఇలా అన్నింటినీ కైవసం చేసుకోవాలన్న పథకంతో ఉన్నారు. అంతేకాదు కరోనాతో ప్రపంచంపై బయోవార్కు దిగారు. వారికి ముఖ్యమైనది ఆర్థిక వ్యవస్థ. భారత్లో చైనా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తే ఆ దేశ దుష్ట అధికారాలు కూడా తగ్గుతాయి. అప్పుడే ప్రపంచం మంచి స్థాయిలో ఉంటుంది’’ అని కంగనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చైనా యాప్స్ నిషేధించిన నేపథ్యంలో దేశీయ ప్రొడక్ట్స్ను ఉపయోగించాలని కంగనా ప్రజలను కోరారు.
దేశ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం తీసుకున్న ఈ యాప్స్ నిషేధంపై నమ్మకం ఉంచండి. అది పక్కన పెడితే.. సోషల్ మీడియాకు బానిసవ్వడం, మానసిక ఆరోగ్యం మనకు తెలిసిన విరోధులు. వాటికి కాస్త విరామం ఇవ్వండి. బానిసత్వం నుంచి బయటపడటానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి సహకరిస్తుంది - అమృత రావ్
లాక్డౌన్లో ఓ మంచి వార్త విన్నాను. మొత్తానికి కొంతమంది హాస్యాస్పదమైన వీడియోలు చూడాల్సిన పనిలేదు - మలైకా అరోరా
మేం ఎప్పుడైనా యాప్స్ను అన్ఇన్స్టాల్ చేయగలం - రీచా చద్దా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా