Bollywood: కరోనా కష్టం.. బాలీవుడ్కు నష్టం
కరోనా చిత్రసీమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తొలి, రెండో వేవ్ల్లో దాని విజృంభణకు భారీ నష్టాల్ని మూటగట్టుకుంది బాలీవుడ్ చిత్రసీమ. అయిందేదో అయిపోయింది ఈ ఏడాది బాగుంటుందన్న ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినా నిరాశే ఎదురైంది.
తొలి మూడు నెలల్లో రూ.1500కోట్లు
విడుదల వాయిదాలు... ఆగిన చిత్రీకరణలు
కరోనా చిత్రసీమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తొలి, రెండో వేవ్ల్లో దాని విజృంభణకు భారీ నష్టాల్ని మూటగట్టుకుంది బాలీవుడ్ చిత్రసీమ. అయిందేదో అయిపోయింది ఈ ఏడాది బాగుంటుందన్న ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినా నిరాశే ఎదురైంది. మూడో వేవ్ దెబ్బకు మళ్లీ కథ మొదటికొచ్చింది. విడుదలలు వాయిదా వేయాల్సి వచ్చింది. షూటింగులు ఆగిపోయాయి. చాలా చోట్ల థియేటర్లు నడవడం లేదు. నడిచే చోట 50 ఆక్యుపెన్సీ. దీంతో పలు పాన్ ఇండియా స్థాయి సినిమాలతో పాటు భారీ బాలీవుడ్ చిత్రాల విడుదలా ఆగిపోయింది. దీంతో బాలీవుడ్కు తీవ్ర నష్టం తప్పట్లేదు.
కరోనా మూడోవేవ్ కారణంగా సినిమా విడుదలల వాయిదా, చిత్రీకరణ షెడ్యూల్స్ అన్నీ మారిపోవడంతో బాలీవుడ్ ఓ విధంగా స్తంభించిపోయింది. ‘జెర్సీ’ సినిమా వాయిదాతో కరోనా ప్రభావం చిత్రసీమ మీద మొదలైంది. షాహిద్కపూర్ కథానాయకుడిగా గౌతమ్తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇలా మొదలైన వాయిదాల పర్వం ‘ఆర్ఆర్ఆర్’తో రెట్టింపైంది. సినీవర్గాల్లో ఆందోళనా పెరిగిపోయింది. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ఇండియా స్థాయిలో క్రేజీ చిత్రంగా మారింది. ఆ తర్వాత ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అక్షయ్కుమార్ ‘పృథ్వీరాజ్’ వాయిదా పడటంతో బాలీవుడ్లో సందడే పోయింది. మార్చి వరకూ ఈ పరిస్థితి. అదే జరిగితే తక్కువలో తక్కువ రూ.1000కోట్లు పైగానే నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ‘‘2019 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి బాక్సాఫీసు లెక్కలు మారాయి. సంవత్సర లెక్కలు కాకుండా మూడు నెలల చొప్పున అంచనా వేస్తున్నాం. అలా చూసుకుంటే ఈ ఏడాది తొలి త్రైమాసికం దెబ్బతిన్నట్టే. దీని వల్ల చిత్ర నిర్మాణ రంగమే కాదు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ దెబ్బతింది’’అంటున్నారు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవో శిభాషిస్ సర్కార్.
పండగను కోల్పోయాం
కీలకమైన పండగ సీజన్ బాలీవుడ్ని బాగా దెబ్బకొట్టిందనే ఆవేదన పరిశ్రమలో వ్యక్తం అవుతోంది. ‘‘బాక్సాఫీసు లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడాది తొలి త్రైమాసిక నష్టం రూ.1500కోట్లు. ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన పండగ సీజన్ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఫిబ్రవరి, మార్చిల్లో పరిస్థితులు అనుకూలించేలా లేవు. దాంతో ఏప్రిల్ నుంచి పరిస్థితి గాడిన పడుతుందనే ఆశతో ఉన్నాం’’అంటున్నారు ట్రేడ్ విశ్లేషకుడు జోగిందర్.
చిత్రీకరణలు ఆగిపోయినా నష్టమే
భారీ చిత్రాల షూటింగులు నిలిచిపోవడమూ తీవ్ర నష్టమే అంటున్నారు నిర్మాతలు. ‘‘పెద్ద చిత్రాల నుంచి ఓ మాదిరి బడ్జెట్ చిత్రాల వరకూ షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా చాలా సన్నాహాలు జరుగుతాయి. దాని కోసం రూ.కోట్లలో వ్యయం అవుతుంది. అవుట్డోర్ షెడ్యూల్స్ అంటే మరింత ఖర్చు ఉంటుంది. కరోనా తీవ్రత పెరగడంతో షూటింగులు ఆగిపోతున్నాయి. దీంతో చేసిన వ్యయంలో చాలావరకూ వృథా అయిపోతుంది. మళ్లీ షెడ్యూల్ ప్లాన్ చేయాలంటే బడ్జెట్ పెరిగిపోతుంది. అంతే కాకుండా అనుకున్న సమయానికి విడుదల చేయలేని పరిస్థితి. సర్దుకుపోయి ఏదో ఒక తేదీకి విడుదల చేస్తే ఆశించిన వసూళ్లు రావు’’అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏప్రిల్ వరకూ థియేటర్ల పరిస్థితులు మారేలా కనిపించడం లేదు. మార్చి తొలివారం తర్వాత ఆశాజనకంగా మారి భారీ చిత్రాలు విడుదల మొదలై, చిత్రీకరణలైనా అనుకున్న ప్రకారం జరిగితే కొంతమేర నష్టాల నుంచి గట్టెక్కొచ్చు అంటున్నాయి సినీ వ్యాపార వర్గాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..