HBD Nagarjuna: సాహసాల ‘గ్రీకువీరుడు’.. అభిమానుల ‘మన్మథుడు’
Nagarjuna: నిత్య మన్మథుడు.. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
సైకిల్ చైన్ తెంచి టాలీవుడ్ హీరోయిజానికి కొత్త దారి వేసిన కథానాయకుడు నాగార్జున. ‘హలో గురు ప్రేమకోసమే’అని పాడుకుంటూ హీరోయిన్ వెంటపడితే ప్రేక్షకులూ గంతులేశారు. మా..మా.. మాస్ అంటూ చొక్కా మడతేసి కొడితే థియేటర్లో అభిమానులు పూనకంతో ఊగిపోయారు. క్యాన్సర్ బాధితుడిగా ‘గీతాంజలి’లో చూపించిన విషాదానికి సినిమా హాళ్లు కన్నీళ్లతో తడిశాయి. ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’ సినిమాలకి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది తెలుగు సినీ లోకం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ టాలీవుడ్ ‘కింగ్’గా సాగిపోతున్నారాయన. ఇవాళ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
సాహసాలకు వెనకాడని నైజం
కెరీర్ ఆరంభం నుంచే తన సాహసాలతో టాలీవుడ్ను ఆశ్చర్యపరిచిన హీరో నాగార్జున. ‘విక్రమ్’తో వెండితెర అరంగేట్రం చేసిన నాగ్ అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన చేరేందుకు ఓ రకంగా ఆ సాహసాలే తోడ్పడ్డాయని చెప్పొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా లేని ఓ పాతికేళ్ల కుర్రాడికి డైరెక్టర్గా అవకాశమివ్వడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఆ కుర్ర దర్శకుడే రామ్గోపాల్ వర్మ. వీరిద్దరూ తీసిన ‘శివ’ టాలీవుడ్లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఇలాంటి సాహసాలు తన కెరీర్లో మరెన్నో చేశాడాయన. అగ్రహీరోలంతా కమర్షియల్ సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్న సమయంలో ‘గీతాంజలి’ లాంటి విషాద కావ్యాన్ని టాలీవుడ్కు అందించి తన మార్క్ చూపించాడు. భక్తి చిత్రాలకు కమర్షియల్ సినిమాల స్థాయి కలెక్షన్లు రప్పించడం నాగార్జునకే చెల్లింది. ‘ఘరానా బుల్లోడు’, ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి సూపర్ హిట్లు తీసిన తర్వాత ‘అన్నమయ్య’ లాంటి భక్తిరస చిత్రాన్ని ఎంచుకోవడం కూడా అప్పట్లో ఓ సాహసమే.
అమ్మాయిల కలల రాకుమారుడు
90వ దశకం నుంచే తెలుగమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు నాగార్జున. ‘మజ్ను’, ‘గీతాంజలి’ సినిమాలతో మహిళల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా నాటికి ఆ అభిమానం తారస్థాయికి చేరింది. ఆ తర్వాత వచ్చిన ‘మన్మథుడు’, ‘సంతోషం’ లాంటి సినిమాలతో టాలీవుడ్ మన్మథుడిగా మారిపోయారు. పురుషులతో సరిసమానమైన మహిళా అభిమానులను నాగార్జునకు ఉన్నారనడంలో సందేహం అక్కర్లేదు.
బుల్లితెరపైనా విశ్వరూపం
వెండితెరపై ఎన్నో హిట్లిచ్చిన నాగార్జున.. బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. తొలిసారి ఆయనే నిర్మించిన ‘యువ’ అనే సీరియల్లో మెరిసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిందీలో పాపులర్ రియాలిటీ షో అయినా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా తీసుకొచ్చారు షో నిర్వాహకులు. ఆ కార్యక్రమాన్ని తనదైన స్టైల్ జోడించి రక్తి కట్టించారు. ఆ తర్వాత ‘బిగ్బాస్’కి కూడా హోస్ట్ గా చేసి మెప్పించారాయన. త్వరలోనే బిగ్బాస్ కొత్త సీజన్ ఆరంభం కానుంది. ఈ రియాలిటీ షోలతో బుల్లితెరపైనా అభిమానులను సంపాదించుకున్నారాయన.
ఏఎన్నాఆర్తో ఆరు
తెలుగుతెరపై చెరిగిపోని ముద్రవేసిన లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆ వారసత్వాన్ని నాగార్జున విజయవంతంగా కొనసాగించారు. అయితే వీరిద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. ఆయనతో నాగార్జున చేసిన చివరి సినిమా ‘మనం’ మంచి విజయం సాధించింది. అయితే వీరిద్దరూ దీనికన్నా ముందు మరికొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు. నాగార్జున హీరో అయ్యాక తొలిసారి ‘రావుగారి ఇల్లు’లో నటించారు. ఆ తర్వాత ‘కలెక్టరుగారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’, ‘ఇద్దరూ ఇద్దరే’, ‘శ్రీరామదాసు’ ఇలా మొత్తం ఆరు సినిమాల్లో కలిసి నటించారు. అయితే అంతకుముందే ఏయన్నార్ ‘సుడిగుండాలు’ చిత్రంలో బాలనటుడిగా చేశాడు నాగ్. తండ్రి ఏయన్నార్తోనే కాకుండా తన ఇద్దరు కుమారులు నాగచైతన్య,అఖిల్లతోనూ కలిసి నటించారాయన.
వైవిధ్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్
ఓ వైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే వైవిధ్యమైన పాత్రలు, సినిమాల కోసం పరితపించే అగ్రహీరోల్లో నాగ్ కచ్చితంగా ముందుంటారు. ఇండస్ట్రీ హిట్లు అందించినప్పుడు.. ఆ వెంటనే ఏదో ఒక విభిన్న కథాంశంతో చిత్రాలను ముందుకు తెచ్చేవారాయన. ‘విక్కీదాదా’తో హిట్ కొట్టిన వెంటనే ‘గీతాంజలి’ విడుదలైంది. అందులో క్యాన్సర్ రోగిగా ఆయన నటనకు ప్రశంసల జల్లు కురిసింది. ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి రొమాంటిక్ సినిమాతో బాక్సాఫీస్ కాసుల వర్షం కురిపించిన ఆయన, ఆ వెంటనే ‘అన్నమయ్య’ సినిమా చేశారు. ఇలా ఓ వైపు కమర్షియల్ హిట్లు కొడుతూనే ఆ వెనువెంటనే వైవిధ్యంగా దర్శనిమిచ్చేవారు. ఇలాగే ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాల తర్వాత ‘ఊపిరి’ సినిమా చేశారు. అందులో కాళ్లు, చేతులు పనిచేయని సంపన్నుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీలో నటిస్తుండగా, కల్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ‘బంగార్రాజు’గా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు నాగ్. హిందీలో ‘బ్రహ్మస్త్ర’లోనూ నటిస్తున్నారు. నాగ్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ... ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.