Sivakarthikeyan: తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా
‘రెమో’, ‘సీమరాజా’, ‘శక్తి’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. ఇప్పుడాయన హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా
‘రెమో’, ‘సీమరాజా’, ‘శక్తి’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. ఇప్పుడాయన హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా ‘డాక్టర్’. నెల్సన్ దిలిప్కుమార్ తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఈ చిత్రం శనివారం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు శివ కార్తికేయన్.
బయట డాక్టర్లకి.. తెరపై కనిపించే ఈ ‘డాక్టర్’కి తేడా ఏంటి?
‘‘మిగతా డాక్టర్లలాగే ఈ డాక్టర్ ఆపరేషన్లు చేస్తుంటాడు. వాటితో పాటు విభిన్నంగా ఇంకొన్ని ఆపరేషన్లు చేస్తుంటాడు. అవేంటన్నది తెరపై చూడాలి. నేనిందులో ఆర్మీ డాక్టర్గా కనిపిస్తా. టీజర్లు, ట్రైలర్లలో చూపించినట్లు ఇందులో మానవుల అక్రమ రవాణా, మానవ అవయవాల స్మగ్లింగ్ వంటివి అన్నీ ఉన్నాయి. అయితే అది ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దాని వల్ల ఏం జరిగింది? వాటన్నింటినీ ఈ ఆర్మీ డాక్టర్ ఎలా అడ్డుకున్నాడు? అన్నది మిగతా కథ.
మీరే నిర్మించాలని ఎందుకనుకున్నారు?
‘‘దర్శకుడు నెల్సన్తో నా ప్రయాణం 2007లో మొదలైంది. నేను టెలివిజన్లో పని చేసే రోజుల నుంచే తను నాకు మంచి మిత్రుడు. నేను చేసిన ఓ షోకి తను దర్శకత్వం చేశాడు. తనపై.. తన కథపై ఉన్న నమ్మకంతోనే ఈ చిత్రం నిర్మించాలని నిర్ణయించుకున్నా. నెల్సన్ ఈ కథని రాసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఇది ప్రత్యేకంగా నాయకానాయికల చుట్టూనో హీరో, విలన్ల చుట్టూనో తిరిగే కథ కాదు. ప్రతి పాత్రకు ప్రాధాన్యముంది.
ఈ సినిమాలో మీకు బాగా సవాల్గా అనిపించినవేంటి?
‘‘ఈ చిత్రంలో నా పాత్రకి ఎలాంటి భావోద్వేగాలుండవు. తనెప్పుడూ ఏడవడు.. నవ్వడు.. అతిగా కోపం ప్రదర్శించడు.. ఏ ఎమోషన్ ఉండదు. ఓ మిస్టీరియస్ పర్సన్లా ఉంటాడు. ఇలా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఓ సీరియస్ పాత్రలో నటించడం చాలా సవాల్తో కూడుకున్న పని’’.
ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యమైనట్లుంది కదా..
‘‘కొవిడ్ వల్లే ఆలస్యమైంది. తొలి లాక్డౌన్ సమయానికే మేం 80శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన షూట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తి చేశాం. అందుకే వేసవికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. ఈలోపు మళ్లీ కరోనా ఉద్ధృతి పెరగడంతో మా ప్రణాళికలు తారుమారయ్యాయి. ఇలాంటి సినిమా థియేటర్లలో చూస్తేనే.. ఆ అనుభూతి తెలుస్తుంది.
కొత్త సినిమాల విశేషాలేంటి?
‘‘తమిళంలో ‘అయ్లాన్’ అనే సోసియో ఫాంటసీ చిత్రం చేస్తున్నాను. ఓ ఏలియన్ భూమి మీదకి వస్తే ఏమైంది? హీరో.. ఆ ఏలియన్ కలిసి ఏం చేశారన్నది ఆ చిత్ర కథాంశం. చిత్రీకరణ పూర్తయింది. ‘డాన్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నేను తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నా. ఆ ప్రాజెక్ట్ సెట్స్పైకి ఎప్పుడు వెళ్తుందన్నది ఇప్పుడే చెప్పలేను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.