మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి
‘మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి. కష్టపడేవాడికి భూమ్మీదే ఫలితం లభించాలి.. ఇదే టైమ్ బ్యాంకింగ్ సిద్ధాంతం ’ అని అంటున్నారు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్ వేదికగా ఆయన ఎన్నో అంశాల గురించి తన అభిప్రాయాన్ని బహిర్గతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
‘టైమ్ బ్యాంకింగ్’ గురించి పూరీ ఏమన్నారంటే..!
హైదరాబాద్: ‘మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి. కష్టపడేవాడికి భూమ్మీదే ఫలితం లభించాలి.. ఇదే టైమ్ బ్యాంకింగ్ సిద్ధాంతం ’ అని అంటున్నారు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్ వేదికగా ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘టైమ్ బ్యాంకింగ్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎడ్గర్ఖాన్ అనే వ్యక్తి ‘టైమ్ బ్యాంకింగ్’ కనిపెట్టారు. ఇది డబ్బు మీద కాదు సేవలపై ఆధారపడి పనిచేస్తుంది. మొట్టమొదట స్విట్జర్లాండ్లో వృద్ధుల కోసం దీనిని ప్రారంభించారు. ఇందులో మనం చేయాల్సిన పని ఏమిటంటే.. సేవలు ఇచ్చిపుచ్చుకోవడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 500 టైమ్ బ్యాంక్లు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలోని మధ్యప్రదేశ్లో త్వరలో ‘టైమ్ బ్యాంకింగ్’ ప్రారంభించనున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. గడిచిపోతున్న ప్రతి గంటను ఎందుకు వృథా చేయాలి’ అని పూరీ జగన్నాథ్ తెలిపారు.
అనంతరం ఆయన ‘ట్రావెలింగ్’ గురించి స్పందిస్తూ..‘‘ట్రావెలింగ్’ ఒక అద్భుతమైన విషయం. మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే ‘ఐ యామ్ ఏ ట్రావెలర్’ అని చెప్పాలని ఉంది. ప్రపంచం మొత్తాన్ని అన్వేషించాలనుంది. కానీ సంసారం అనే సాగరంలో చిక్కుకున్నాను కాబట్టి కుదరదు. అయినా పర్వాలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి వెళ్లండి.. తిరిగి రండి. ఒక గ్రూప్తో వెళ్లి గైడ్ వెనకాల తిరిగే వాళ్లని టూరిస్ట్లంటారు. ఇష్టమొచ్చిన ప్రాంతానికి వెళ్లేవాడిని ట్రావెలర్స్ అంటారు. ఈ ప్రపంచం ఒక పెద్ద పుస్తకం. నువ్వు మీ ఊళ్లోనే పుట్టి.. అక్కడే మరణిస్తే నీకు ఒక పేజీ మాత్రమే తెలుసు అని అర్థం. వీలైనన్ని పేజీలు తిరగేయండి. అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్ చేయాలో ఒకసారి గూగుల్ చేయండి’ అని పూరీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?