గుడ్బై 2020.. పార్టీకి వేళాయరా..!
2020.. ఎన్నో ఆనందోత్సాహాలతో ప్రారంభమైన ఈ ఏడాది కరోనా వల్ల ప్రతి ఒక్కరికీ ఎంతో కఠినంగా మారింది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు....
ప్రియమైనవారితో తారలు టేకాఫ్
ఇంటర్నెట్డెస్క్: 2020.. ఎన్నో ఆనందోత్సాహాలతో ప్రారంభమైన ఈ ఏడాది కరోనా వల్ల ప్రతి ఒక్కరికీ ఎంతో కఠినంగా మారింది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. కాగా, మరికొన్ని గంటల్లో 2020 ముగుస్తుండడంతో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారలు తమ ప్రియమైన వారితో కలిసి హాలీడేను ఎంజాయ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తమ కుటుంబసభ్యులతో కలిసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడం కోసం బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో కొంతమంది తారలు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎయిర్పోర్ట్ల వద్ద దర్శనమిస్తున్నారు.
మనువుతో ఒక్కటైన చోటికే..
సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండే సామ్-చై 2021కు ఆహ్వానం పలికేందుకు బెస్ట్ ప్లేస్గా గోవాను ఎంచుకున్నారు. దీంతో ఈ జంట తాజాగా గోవాకు పయనమయ్యింది. 2017లో చై-సామ్ల వెడ్డింగ్ గోవాలోనే జరిగిన విషయం తెలిసిందే. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ జంట పోస్ట్ చేసే ఫొటోల కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోవా నుంచి వచ్చాక సామ్.. ‘సామ్జామ్’, ‘కాతువక్కుల రెండు కాదల్’, ‘ఫ్యామిలీ మ్యాన్2’ చిత్రీకరణల్లో బిజీ కానున్నారు. చైతన్య సైతం ‘లవ్స్టోరీ’ షూట్లో భాగం కానున్నారు.
పింక్సిటీకి బాలీవుడ్ ప్రేమజంట..
బాలీవుడ్ ప్రేమజంట రణ్బీర్-ఆలియాభట్ కొత్త సంవత్సర వేడుకల కోసం పింక్సిటీగా పేరుపొందిన జైపూర్ను ఎంచుకున్నారు. రణ్బీర్ కుటుంబసభ్యులతో కలిసి ఆలియా ఈ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ మేరకు ఈ జంట తాజాగా జైపూర్ చేరుకుంది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న నీతూకపూర్(రణ్బీర్ తల్లి) వేడుకల్లో పాల్గొంటున్నారు. వెకేషన్ నుంచి రాగానే.. ఆలియా-రణ్బీర్ ‘బ్రహ్మాస్త్ర’ షూట్తో బిజీ కావొచ్చు అని బీటౌన్ వర్గాలు అనుకుంటున్నాయి.
దీప్వీర్ కూడా అక్కడికే..
బాలీవుడ్లో లవ్లీ కపుల్గా పేరుపొందిన మరో జంట దీపికాపదుకొణె-రణ్వీర్ సింగ్. 2020కి ముగింపు పలికేందుకు తాజాగా ఈ జంట జైపూర్కు వెళ్లారు. రణ్బీర్కపూర్-ఆలియా జంటతో కలిసి దీప్-వీర్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. మరోవైపు దీపికా-రణ్వీర్ కలిసి నటించిన ‘83’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
మాల్దీవులకు మరో ప్రేమజంట..
బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్ర, నటి కియారా అడ్వాణీ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట న్యూఇయర్ వేడుకల కోసం మాల్దీవులను పర్ఫెక్ట్ ప్లేస్గా ఎంచుకుంది. ఈ మేరకు తాజాగా వీరిద్దరూ ముంబయి ఎయిర్పోర్ట్లో కలిసి దర్శనమిచ్చారు.
మరోసారి మాల్దీవులకే ఓటేసిన టైగర్-దిశా
2021కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే టైగర్ ష్రాఫ్, దిశాపటానీ మాల్దీవులకు వెళ్లారు. లాక్డౌన్ అనంతరం ఇటీవల మాల్దీవులకు వెళ్లి వచ్చిన ఈ జంట కొత్త సంవత్సర వేడుకలకు డెస్టినేషన్గా మరోసారి అదే ప్రాంతానికి ఓటేశారు. వెకేషన్కు సంబంధించిన ఫొటోలను సైతం ఈ జంట నెట్టింట్లో పోస్ట్ చేస్తుంది.
అనన్య-ఇషాన్ కూడా..
బాలీవుడ్ నటి అనన్యపాండే.. నటుడు ఇషాన్ ఖత్తర్ డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్లో ప్రచారం సాగుతోంది. తాజాగా వీరిద్దరూ కలిసి 2020కు గుడ్బై చెప్పేందుకు మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ బుధవారం ఉదయం ముంబయి ఎయిర్పోర్ట్లో కనిపించారు. వెకేషన్ నుంచి వచ్చాక అనన్య.. ‘ఫైటర్’ షూట్లో పాల్గొంటారని సమాచారం.
సాగరతీరంలో మరో జంట
బాలీవుడ్ నటుడు అర్జున్కపూర్-నటి మలైకా అరోడా గత కొన్నిరోజులుగా గోవాలో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు వెళ్లిన ఈ జంట వెకేషన్లో దిగిన ఫొటోలతో నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అయితే వీరితోపాటు ప్రముఖ నిర్మాత కరణ్జోహార్తో సైతం గోవాలోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..