The Railway Men: వెబ్ సిరీస్గా రానున్న 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. ఆర్. మాధవన్ హీరో
‘‘ కొన్ని కథలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒకటి 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన’’ అని అన్నారు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్. 37ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్లో మిథైల్ ఐసోసనియేట్ రసాయనం లీకై సుమారు 3,800 మంది చనిపోయగా.. 5లక్షల మందికిపైగా గాయాలపాలయ్యారు.
‘ది రైల్వే మెన్’ పేరుతో విడుదల
ఇదే యశ్రాజ్ ఫిల్మ్ తొలి ఓటీటీ సిరీస్
ఇంటర్నెట్ డెస్క్: ‘‘ కొన్ని వాస్తవ సంఘటనలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒకటి 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన’’ అని అన్నారు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్. 37ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్లో మిథైల్ ఐసోసనియేట్ రసాయనం లీకై సుమారు 3,800 మంది చనిపోయగా.. 5లక్షల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పారిశ్రామిక విపత్తుగా పరిగణించిన ఈ ఘటన... ఇప్పుడు వెబ్సిరీస్ రూపంలో ‘‘ ది రైల్వే మెన్- ది అన్టోల్డ్ స్టోరీ’’ పేరుతో రానుంది. బుధవారం ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు మాధవన్. ‘‘ 37ఏళ్ల క్రితం భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు అర్పించిన రైల్వే ఉద్యోగులకు ఈ చిత్రంతో నివాళి అర్పిస్తున్నాం. యశ్రాజ్ తొలి ఓటీటీ ప్రాజెక్ట్ అయిన ఇందులో నటించడం గర్వంగా ఉంది. 2022 డిసెంబర్2న విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).