Alpha-Beta: ఒకే మహిళలో రెండు వేరియంట్లు..!
బెల్జియంకు చెందిన ఓ వృద్ధురాలిలో (90) ఓకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లు వెలుగు చూశాయి. అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది.
కొవిడ్ తీవ్రతతో మృతిచెందిన బెల్జియం వృద్ధురాలు
బెల్జియం: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ఒక్కోవ్యక్తిలో ఒక్కో విధమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు విస్తృత వ్యాప్తి, ఎక్కువ ప్రభావం కలిగి ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ మహిళలో ఓకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. బెల్జియంకు చెందిన ఓ వృద్ధురాలిలో (90) ఈ రెండు రకాలు నిర్ధారణ అయినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయినట్లు యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నివేదిక వెల్లడించింది.
బెల్జియంలోని ఆల్ట్స్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలి(90)కి కరోనా లక్షణాలు ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు జరిపిన పరీక్షల్లో ఆమెకు కొవిడ్-19 నిర్ధారణ అయ్యింది. తొలుత ఆక్సిజన్ స్థాయిలు సరిపడా ఉన్నప్పటికీ ఐదు రోజుల అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె నమూనాలకు జీనోమిక్స్ సీక్వెన్సింగ్ చేపట్టగా.. ఆమెకు ఆల్ఫా, బీటా రెండు వేరియంట్లు సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే, నర్సింగ్హోం సంరక్షణలో ఉన్న ఆ వృద్ధురాలు వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్యులు గుర్తించారు.
రెండు వేర్వేరు ఇన్ఫెక్షన్లు సోకిన వ్యక్తుల నుంచి వృద్ధురాలికి ఈ వేరియంట్లు సోకి ఉండొచ్చని OLV ఆస్పత్రి నిపుణురాలు అన్నే వంకీర్బర్గన్ పేర్కొన్నారు. కచ్చితంగా ఆమెకు రెండు వేరియంట్లు ఎలా సోకాయనే విషయం అంతుపట్టడం లేదన్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడానికి కో-ఇన్ఫెక్షన్ (ఒకేసారి రెండు వేరియంట్లు) కారణమని చెప్పడం కూడా కష్టమేనని అన్నారు. ఇలాంటి కేసులకు సంబంధించిన నివేదికలు ఇప్పటివరకు అందుబాటులో లేవని.. అయినప్పటికీ ఆ కోణంలో కేసులు నమోదు కావని చెప్పడం వాటిని తక్కువ అంచనా వేయడమేనన్నారు.
గతంలో బ్రెజిల్లోనూ..
ఒకేవ్యక్తిలో రెండు భిన్న వేరియంట్లు సోకిన సంఘటన జనవరి నెలలో బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఓకేసారి ఇద్దరి వ్యక్తుల్లో రెండు వేర్వేరు వేరియంట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చాలా అరుదుగా జరిగే ఇటువంటి కేసులకు సంబంధించిన పరిశోధనాత్మక సమాచారం మాత్రం ఇంతవరకు సైంటిఫిక్ జర్నల్లో అందుబాటులో లేదని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్కు చెందిన లారెన్స్ యోంగ్ పేర్కొన్నారు. ఒకేసారి రెండు వేరియంట్లు వెలుగు చూడడం ఆశ్చర్యకర విషయమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఇన్ఫ్లుయెంజా విషయంలో ఇటువంటి కేసులకు సంబంధించి రుజువులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వేరియంట్ల నుంచి వ్యాక్సిన్లు ఏమేరకు రక్షణ కల్పిస్తాయనే విషయాన్ని తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు చేపట్టాలని అన్నారు. ఇదిలా ఉంటే, ఆల్ఫా వేరియంట్ తొలుత బ్రిటన్లో వెలుగు చూడగా.. బీటా వేరియంట్ దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.