WHO: భారత్లో వారంలోనే 150% పెరిగిన కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ఓ
ఆగ్నేయాసియాలో కొవిడ్-19 కేసులు పెరిగేందుకు భారత్ మూలకారణం అని, ఆ దేశంలో వారంలోనే 150 శాతం కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది......
జెనీవా: ఆగ్నేయాసియాలో కొవిడ్-19 కేసులు పెరిగేందుకు భారత్ మూలకారణమని, ఆ దేశంలో వారంలోనే 150 శాతం కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. గడిచిన వారంలో భారత్లో 15,94,160 కేసులు నమోదయ్యాయని.. అంతకుముందు వారం 6,38,872 కేసులు మాత్రమే వెలుగుచూశాయని డబ్ల్యూహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది.
తూర్పు మధ్యధరా ప్రాంతాల్లోనూ గడిచిన వారంలో కొవిడ్ వ్యాప్తి బాగా పెరిగినట్లు ఆరోగ్య సంస్థ పేర్కొంది. మొరాకోలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు వారం 4,610 కేసులు బయటపడితే, గడిచిన వారం 45 శాతం పెరిగిపోయి 31,701 కొత్త కేసులు నిర్ధరణ అయినట్లు వెల్లడించింది. ట్యూనీషియాలో అత్యధికంగా 194 శాతం వృద్ధిచెంది గతవారం 13,416 కొత్త కేసులు బయటపడ్డాయని, లెబనాన్లో 19 శాతం పెరిగి 38,112 కేసులు వెలుగుచూసినట్లు వివరించింది.
తీవ్ర వ్యాప్తిగల ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకు 171 దేశాలకు పాకినట్లు WHO వెల్లడించింది. ఈ వేరియంట్లో తీవ్రమైన వ్యాధి, ఇన్ఫెక్షన్ కారణంగా మరణించే ప్రమాదం తక్కువగానే ఉన్నప్పటికీ.. ఓమిక్రాన్కు సంబంధించిన మొత్తం ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ‘మునుపటి సార్క్-కోవ్-2 వేరియంట్ల కంటే ఒమిక్రాన్లో తీవ్రమైన వ్యాధి, సంక్రమణ అధికంగా ఉన్నప్పటికీ మరణాల ప్రమాదం తక్కువగా ఉంది. కానీ చాలా వేగంగా వ్యాప్తి చెందే గుణం కారణంగా ఎక్కువమందికి సంక్రమిస్తోంది. చాలా మంది ఆసుపత్రుల్లో చేరారు. అనేక దేశాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడింది’ అని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: టెడ్రోస్ అధనామ్
కొవిడ్ మహమ్మారి తీవ్రమైన దశను అంతం చేసేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. దీన్ని అంతం చేసేందుకు ఆయా దేశాల వద్ద అన్ని సాధనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ‘కొవిడ్-19 ఇప్పుడు మూడో సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. మనం ఇప్పుడు క్లిష్ట దశలో ఉన్నాం. మహమ్మారి తీవ్రమైన దశను అంతం చేసేందుకు మనం కలిసి పని చేయాలి. కరోనాను ఇలాగే కొనసాగించకూడదు’ అని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.